amp pages | Sakshi

ఆశయం తీరకుండానే.. అనంతలోకాలకు

Published on Mon, 08/05/2013 - 04:06

గట్టు, న్యూస్‌లైన్: నిత్యం మిణుకు మిణుకుమంటూ వెలిగే వి ద్యుత్ బల్బుల స్థానంలో కొత్తవాటిని అమర్చాల ని ఆ తండా యువకులు అధికారులకు నివేదించా రు. శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన వి ద్యుత్ స్తంభాలను మార్చాలని విన్నవించారు. అందులో భాగంగానే తండాకు స్తంభాలను తీసుకొస్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
 
 మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన శనివారం అర్ధరాత్రి  కేటీదొడ్డి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..ధరూర్ మండలం గువ్వలదిన్నె గ్రామపంచాయతీ పరిధిలోని తూర్పుతండాకు చెందిన ఆరుగురు గిరిజనులు విద్యుత్ స్తంభాల కోసం తమ ట్రాక్టర్‌లో గద్వాలకు వెళ్లారు.
 
 అర్ధరాత్రి అక్కడి డివిజన్ కార్యాలయంలో పదింటిని ట్రాక్టర్‌లో లోడు చేసుకుని తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలోని గట్టు మండలం కాలూర్‌తిమ్మన్‌దొడ్డి సమీపంలోకి చేరుకోగానే మధ్యటైరు పగిలిపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలో పడిపోయింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న చందూనాయక్ (20), హన్మంతునాయక్ (40), రవీంద్రనాయక్ (20) అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రామునాయక్‌తో పాటు ముడావత్‌నాయక్, తిమ్మానాయక్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
 
 100 కాల్ సెంటర్‌తో వెలుగులోకి
 ఆ సమయంలో సహాయం కోసం క్షతగాత్రుల ఆర్తనాదాలు వినేవారే కరువయ్యారు. వారు వెంటనే 100కు కాల్ సెంటర్‌తో పాటు తమ బంధువులకు ఫోన్ చేశారు. దీంతో జిల్లా కేంద్రంలోని సిబ్బంది గట్టు పోలీసులను అప్రమత్తం చేశారు. ఎట్టకేలకు ఆదివారం తెల్లవారుజామున సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గద్వాల ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
 
 ఈ మేరకు సీఐ షాకీర్‌హుస్సేన్, ఏఎస్‌ఐ జయరాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల్లో హన్మంత్ నాయక్‌కు భార్య రంగమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మిగతా ఇద్దరు అవివాహిత యువకులు. ఈ సంఘటనతో తూర్పుతండాలో విషాదఛాయలు అలముకున్నాయి. హన్మంతునాయక్ అన్న కుమారుడు చందూనాయక్. ప్రమాదంలో ఇద్దరూ మృత్యువాతపడటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తండాలో ఏ సమస్య వచ్చినా ముందుండే యువకులు ఇలా మృత్యువాతపడటం చూసి గుండెలు బాదుకుంటున్నారు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)