సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Breaking News
ఒక్క క్లిక్తో న్యూస్ రౌండప్..
Published on Tue, 06/18/2019 - 19:58
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ తొలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలు రాష్ట్రలకు చెందిన ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ప్రపంచకప్లో భాగంగా అఫ్గానిస్తాన్ మ్యాచ్లో ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో 17 సిక్సర్లతో క్రికెట్లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. వన్డే మ్యాచ్లో ఇప్పటివరకు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల(16) రికార్డును తిరగరాశాడు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..
Tags