వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
Breaking News
ఈనాటి ముఖ్యాంశాలు
Published on Sun, 09/29/2019 - 20:03
పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. దసరా పండగ ముందు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు భారీ షాక్ ఇచ్చారు. అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు జియాంగ్సూ ప్రావిన్సులో బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 36 మంది చనిపోయారు. మరో 40మంది తీవ్ర గాయాలపాలైనట్లు ఈజింగ్ పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Tags