వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు గవర్నర్ నరసింహన్ జిల్లా రాక
Published on Wed, 04/20/2016 - 02:20
చిత్తూరు (అగ్రికల్చర్): ఈ నెల 20,21 తేదిల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరి 1.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 1.50 గంటలకు బయలుదేరి 2.30 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకుంటారు.
సాయంత్రం 4 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 4.35 గంటలకు తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి 5.05 గంటలకు బయలుదేరి 7 గంటలకు కడపలోని స్టేట్ గెస్ట్హౌస్ చేరుకుంటారు. 21 తేది ఉదయం 7.30 గంటలకు కడప నుంచి బయలుదేరి 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 9.45 గంటలకు హైదరాబాదు వెళతారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
#
Tags