amp pages | Sakshi

సిక్కోలు సమరోత్సాహం

Published on Sun, 02/09/2014 - 04:00

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొనే ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభకు శ్రీకాకుళం సర్వసన్నద్ధమైంది. ఢిల్లీ పెద్దల అహంకారంపై  తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తెలుగు ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన జగన్‌కు జిల్లా బాసటగా నిలవనుంది. ఆయన హోరెత్తిస్తున్న  సమైక్యాంధ్ర నినాదానికి జిల్లా ప్రజానీకం సంఘీభావం ప్రకటించనుంది. అందుకోసం జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది తరలిరానున్నారు. శ్రీకాకుళంలో ఆదివారం నిర్వహించనున్న సమైక్య శంఖారావం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయనుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు భారీస్థాయిలో కీలక ప్రజాప్రతినిధులు, అనుయాయులతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ చారిత్రక రాజకీయ ఘట్టానికి సిక్కోలు సర్వసన్నద్ధమై సమరోత్సాహంతో ఉరకలెత్తుతోంది. 
 
 ప్రతిధ్వనించనున్న ‘సమైక్య’ వాణి 
 సిక్కోలు వేదికగా సమైక్యాంధ్ర నినాదం ప్రతిధ్వనించనుంది. జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి భారీస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు, సమైక్యాంధ్ర కాంక్షించే ప్రజానీకం తరలిరానున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేల సంఖ్యలో వివిధ వాహనాలను సిద్ధం చేసుకున్నారు.  బహిరంగ సభ నిర్వహించనున్న ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల మైదానంతోపాటు శ్రీకాకుళంలో ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతస్థాయిలో జనం తరలిరావడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లా ప్రజల్లో ఉన్న సమైక్యాంధ్ర భావనను ప్రతిబింబించే రీతిలో శ్రీకాకుళం జనంతో కిటకిటలాడనుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే  వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర స్ఫూర్తి వెల్లివిరిసేలా బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 
 
 భారీ అనుచరగణంతో పార్టీలో చేరనున్న ధర్మాన
 సమైక్య శంఖారావం సభలోనే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు భారీస్థాయిలో అనుయాయులతోమ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో  చేరనున్నారు. తన అనుయాయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పదవుల్లో ఉన్న నేతలు, కార్యకర్తలతో కలసి ఆయన పార్టీలో చేరుతారు. జిల్లాలో కాం గ్రెస్ దాదాపు తుడుచుకుపెట్టుకుపోయే రీతిలో చేరికలకు ధర్మాన రంగం సిద్ధం చేశారు. ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఇతర కీలక కాంగ్రెస్, టీడీపీనేతలు ఆయనతోపాటు సుమారు వెయ్యి మంది వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.  ఆదివారం పార్టీలో చేరనున్న నేతలు, కార్యకర్తల కోసం బహిరంగ సభ నిర్వహించే మైదానంలో ప్రత్యేకంగా ఒక ప్రదేశాన్ని కేటాయించడం విశేషం. బహిరంగ సభలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతోపాటు ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ నేతలంతా హాజరుకానున్నారు.
 
 భారీ ర్యాలీ 
 జగన్‌మోహన్‌రెడ్డి రాక సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆయన శ్రీకాకుళం సింహద్వారం వద్దకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభిస్తారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా వచ్చే మోటారుబైక్‌లతో ఈ ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీకి ముందుగా ఓపెన్‌టాప్ వాహనంపై కళా బృందాల ప్రదర్శన ఉంటుంది. సింహద్వారం వద్ద ప్రారంభమయ్యే భారీ ర్యాలీ కొత్తబ్రిడ్జి, డే అండ్ నైట్ కూడలి, పాలకొండ రోడ్డు మీదుగా బహిరంగ సభ జరిగే మున్పిపల్ పాఠశాల మైదానానికి చేరుకుంటుంది. ర్యాలీ సాగే దారి పొడుగునా మహిళలు, విద్యార్థులు జగన్‌కు స్వాగతం పలకనున్నారు. 
 
 సర్వాంగ సుందరంగా మైదానం
 ఈ చారిత్రక ఘట్టానికి శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జగన్‌కు ఉన్న విశేష ప్రజాదారణకు అద్దం పట్టేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాదిగా తరలిరానున్న ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మైదానంలో  30ఁ 60 సైజుతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. పాల్గొనేవారందరికీ జగన్ బాగా  కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమైక్య శంఖారావం పేరిట భారీ ఫ్లెక్సీని వేదిక బ్యాక్‌డ్రాప్‌గా ఏర్పాటు చేస్తున్నారు. మైదానమంతా జగన్ ఫ్లెక్సీలతో అలంకరించారు. సభాస్థలి వద్ద గాలిలో బెలూన్లు కూడా ఎగురవేయనున్నారు. ఇక మైదానంలో చోటులేక బయట నిలిచిపోయ వేలాదిమంది సైతం బహిరంగ సభను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ కూడలి, రేమండ్స్ షోరూం, పాతబస్టాండ్, పాత బ్రిడ్జిల వద్ద పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి బహిరంగ సభను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మైదానంలో ఎంతమంది ఉంటారో అంతకు రెట్టింపుగా జనం బయట ఉండే అవకాశం ఉన్నందున ఎవరూ నిరుత్సాహపడకుండా ఈ ఏర్పాటు చేశారు.  
 
 సమైక్య శక్తిని చాటాలి: కృష్ణదాస్ 
 సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటిచెప్పేలా జగన్ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు సమైక్యాంధ్ర కాంక్షించే వారంతా వై.ఎస్.జగన్ చేస్తున్న పోరాటానికి బాసటగా నిలవాలన్నారు. అందుకోసం శ్రీకాకుళంలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. 
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)