టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
తగ్గుతున్న టమాట ధరలు..
Published on Fri, 08/04/2017 - 09:14
మదనపల్లె : గతకొద్ది రోజులుగా భగ్గుమన్న టమాట రేటు తగ్గుముఖం పట్టింది. ధరలు తగ్గుతుండడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల క్రితం కిలో ధర రూ.83 పలికిన మొదటి రకం టమాట. ప్రస్తుతం రూ.44కు పడిపోయింది. చిత్తూరుజిల్లా మదనపల్లె డివిజన్లోని తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లి, రామసముద్రం తదితర మండలాలతోపాటు కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి, చిలగట్ట, రాయల్పాడు, శ్రీనివాసపురం, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో టమాట పంటను అధికంగా సాగుచేశారు.
ప్రస్తుతం దిగుబడి వస్తుండడంతో కాయలను మదనపల్లె మార్కెట్కు తరలిస్తున్నారు. మార్కెట్కు రోజూ 500 టన్నుల కాయలు వస్తున్నాయి. కాయల దిగుబడి పెరగడం, ఎగుమతులు తగ్గడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆరుగాలం శ్రమించి, రాత్రనక, పగలనక కష్టపడి పండించిన పంటకు ధరలు తగ్గుతుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. మొదటి రకం కాయలు రూ.40–45 మధ్య పలుకుతుండగా రెండో రకం రూ.30 నుంచి రూ.35, మూడో రకం రూ.20 నుంచి రూ.25 మధ్య పలుకుతున్నాయి.
#
Tags