amp pages | Sakshi

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో లైన్‌మన్‌

Published on Tue, 12/04/2018 - 12:27

చిత్తూరు, మదనపల్లె అర్బన్‌ : మదనపల్లెలో సోమవారం వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ లైన్‌మన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఏసీబీ అడిషనల్‌ ఎస్పీలు దీపికా పాటిల్, తిరుమలేశ్వర్‌రెడ్డి కథనం మేరకు.. మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీకి చెందిన రైతు ఈశ్వర్‌ రెడ్డికి కోళ్లబైలులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. సేద్యం చేసుకునేందుకు అప్పులు చేసి బోరు వేయించాడు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నెల రోజుల క్రితం వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరైంది. కనెక్షన్‌ ఇచ్చేందుకు అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ వెంకట్రామయ్య రూ.6 వేలు లంచం అడిగాడు.

బోరు వేసేందుకు తన వద్ద ఉన్న సొమ్మంతా ఖర్చయిపోయిందని చెప్పినా అతను వినలేదు. డబ్బు ఇవ్వకపోతే కనెక్షన్‌ ఇవ్వడం కుదరదని అసిస్టెంట్‌ లైన్‌మన్‌ వెంకట్రామయ్య తేల్చిచెప్పాడు. దీంతో విసిగిపోయిన రైతు ఈశ్వర్‌రెడ్డి న్యాయం చేయాలంటూ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రైతు లైన్‌మన్‌ వెంకట్రామయ్యకు ఫోన్‌ చేసి రూ.5 వేలకు బేరం కుదుర్చుకుని డబ్బులు తీసుకునేందుకు రావాలని కోరాడు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సీటీఎం రోడ్డులోని డివిజనల్‌ కార్యాలయం ఎదుట రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిందితుడు లైన్‌మన్‌ను అరెస్ట్‌ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు అడిషనల్‌ ఎస్పీలు దీపికా పాటిల్, తిరుమలేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి గురించి ప్రజలు 9440446190 కు ఫోన్‌ చేసి తెలిపితే సత్వరమే చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలియజేశారు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?