amp pages | Sakshi

కనరో శ్రీవారి దర్శన భాగ్యము 

Published on Mon, 05/18/2020 - 08:23

తిరుమల శ్రీవారి దర్శన ఏర్పాట్లుపై టీటీడీ యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది. లాక్‌డౌన్‌ తరువాత శ్రీవారి దర్శనానికి భక్తులను ఏ విధంగా అనుమతించాలనే దానిపై లోతైన కసరత్తు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న టీటీడీ ఇందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లుకు పూనుకుంది. 

సాక్షి, తిరుమల: భక్తులను శ్రీవారి దర్శనానికి సామాజిక దూరంతో అనుమతించాలని, సంఖ్యను దాదాపుగా కుదించేందుకు టీటీడీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించి దర్శనాలకు సంబంధించి విధి విధానాలతో కూడిన నిర్ణయాన్ని తీసు కోనుంది. ఈ విధి విధానాలతో ప్రయో గాత్మకంగా టీటీడీ ఉద్యోగులతో మొదలుపెట్టేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. గంటకు 500 మంది చొప్పున దర్శనానికి అనుమతించనున్నారు. తర్వాత తిరుమల, తిరుపతిలో ఉన్న స్థానికులను 10 నుంచి 15 రోజులు పాటు దర్శనానికి అనుమతించేందుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి రోజూ స్వామివారికి నిత్య కైంకర్యాల సమయం మినహాయిస్తే 14 గంటలు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ దర్శనానికి అనుమతించే భక్తులు సంఖ్యను 7 వేలకు పరిమితం చేయనున్నారు. ప్రయోగాత్మాక పరిశీలన పూర్తయ్యాక స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించే అవకాశం కల్పిస్తోంది.  చదవండి:  22న సీఎం చేతుల మీదుగా

ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు? 
శ్రీవారి దర్శనానికి భక్తులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినపక్షంలో టీటీడీ వారికి అవసరమైన దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన స్లాట్ల విధానాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌ లైన్‌ ద్వారా కేటాయించి టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి వద్ద అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలిపిరి, నడకమార్గంలో భక్తులను క్షుణంగా తనిఖి చేసిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తారు. ప్రతి భక్తుడినీ ధర్మల్‌ స్కానింగ్‌ చేయడంతో పాటు శానిటైజేషన్‌ చేయనున్నారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించేలా నిబంధనలు అమలు చేయనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రిసెప్షన్‌ కేంద్రాలలో 50 ఏళ్ల లోపు ఉద్యోగులను డిప్యూటేషన్‌పై నియమించాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. తిరుమలలో వ్యాపారస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలను టీటీడీ నిర్దేశించనుంది. దర్శన విధివిధానాలపై ఇప్పటికే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు  ఈఓ ధర్మారెడ్డి సమీక్షించారు. ఈ నెల 28న నిర్వహించనున్న టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం అధికారికంగా  నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. 


 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్