amp pages | Sakshi

టీటీడీపై పథకం ప్రకారమే తప్పుడు ప్రచారం

Published on Mon, 05/25/2020 - 18:27

సాక్షి, తాడేపల్లి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిరర్థక ఆస్తుల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆస్తుల అమ్మకంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకులేదని, గత బోర్డ్ (టీడీపీ హయాంలో)  తీసుకున్న నిర్ణయంపై మాత్రమే బోర్డు సమావేశంలో చర్చించామని స్పష్టం చేశారు. ఆస్తుల అమ్మకం గురించి బోర్డు తరఫున ఇప్పటి వరకు ఎలాంటి తేదీని ప్రకటించలేదని, నిర్ణయం తీసుకోక ముందే రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదని అన్నారు. టీటీడీ ఆస్తులపై మరోకసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. బోర్డు నిర్ణయం మేరకు ఆస్తులను అమ్మాల్సి వస్తే పీఠాధిపతిలు, స్వామీజీల సలహాలు సూచనలు తీసుకొనే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. టీటీడీని అడ్డుకుపెట్టుకుని కుట్రపూరితంగా తమపై వ్యతిరేకతతో కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆస్తుల అమ్మకం కొత్తమే కాదు..
టీటీడీ  ఆస్తుల విక్రయాల అంశంపై సోమవారం తాడేపల్లిలో వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలో టీటీడీకి సంబంధించిన తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన గుర్తుచేశారు. ‘టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయంపై సమీక్ష మాత్రమే జరిపాము. అమ్మాలి అనుకుంటే ఎక్కోడా మారుమూలన ఉండే ఆస్తులు అమ్ముతామా..? మేము దేవుడు సేవలో ఉన్నాము. దేవుడు సొమ్ము ఆశించించే ప్రసక్తే లేదు. గతంలో నేను క్రిస్టియన్ అని అసత్య ప్రచారం చేశారు. దేవుడు భూముల కాజేయలని చూసింది చంద్రబాబు నాయుడే. సదవర్తి, దుర్గమ్మ భూములు కాజేయాలని చూసింది చంద్రబాబు. దేవుడుకి వచ్చిన ప్రతి పైసా మేము కాపాడుతున్నాము. నిరుపయోగంగా ఉన్న టీటీడీ భూములు అమ్మడం కొత్తేమి కాదు. టీటీడీలో 1974 నుంచి భూములు అమ్ముతున్నారు. చంద్రబాబు హయాంలో కూడా భూములు అమ్మకానికి పెట్టారు.

టీడీపీ హయాంలోనే నిర్ణయం..
టీడీపీ హయాంలో చదలవాడ కృష్ణమూర్తి టీడీపీ చైర్మన్‌ ఉన్నప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉన్న నిరర్ధక టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. ఆస్తుల అమ్మిన వాటిని టీటీడీ కార్పస్ ఫండ్లో వేయాలని నిర్ణయించారు. బీజేపీ నేతలు కూడా వాస్తలు తెలుసుకోవాలి. టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్న సబ్ కమిటీలో బీజేపీ సభ్యలు కూడా ఉన్నారు. ఆస్తుల అమ్మకం గురించి మాట్లాడుతున్న భాను ప్రకాష్ రెడ్డి ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్న సబ్ కమిటీలో సభ్యుడే. టీడీపీ ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయంపై ఎల్లో మీడియా నోరు ఎందుకు మెదపలేదు. ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగేలా ఎల్లో మీడియా వార్తలు రాస్తున్నాయి. ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. వివరణ ఇచ్చిన పదే పదే తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇది సరైనది కాదు’ అని అన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)