amp pages | Sakshi

టీటీడీ ఉద్యోగుల ధర్నా

Published on Sat, 11/22/2014 - 02:26

తిరుపతిసిటీ: టీటీడీలో ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఉద్యోగ సంఘాలు శుక్రవారం తిరుపతి పరిపాలన భవనం ఎదుట బైఠాయించాయి. నియంతలా వ్యవహరిస్తున్న టీటీడీ యాజమాన్యం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని ఉద్యోగులు దీక్ష బూనారు. డెప్యుటేషన్‌పై వచ్చే వారిని నెత్తిన పెట్టుకుని మోయడంలో అంతరార్థం ఏమిటని ప్రశ్నించాయి.

విజిలెన్స్ విభాగం పెత్తనంపై ఆందోళన వ్యక్తం చేశాయి. చిన్నచిన్న తప్పులు చేసినా వివరణ కూడా తీసుకోకుండా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. అసలు నేరుగా విజిలెన్సు విభాగం ఫిర్యాదు చేస్తే ఈవో చర్యలు తీసుకోవడంలో అర్థంలేదన్నారు. క్రమశిక్షణ విభాగాన్ని పరిగణనలోకి తీసుకోకుండా శిక్షించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై టీటీడీ యాజమాన్యానికి పలుమార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో ప్రత్య క్ష పోరాటాలకు దిగామని చెప్పారు.

కులం పేరుతో దూషిస్తే కాలరు పట్టుకోండి..
టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఉద్యోగు ల పట్ల అమానుషంగా వ్యవహరిస్తే పరి ణామాలు తీవ్రంగా ఉంటాయని తిరుప తి మాజీ ఎంపీ చింతామోహన్ హెచ్చరించారు. టీటీడీ ఉద్యోగుల ధర్నాకు ఆయన మద్దతు ప్రకటించారు. సాటి ఉద్యోగిని కులం పేరుతో దూషిస్తే కాల రు పట్టుకోండని అన్నారు.

మంత్రుల చుట్టూ, డీజీపీ కార్యాలయం చుట్టూ తిరిగి డెప్యుటేషన్ పోస్టింగ్స్ ఇప్పించుకు ని స్థానిక ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తు న్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యనతో పాటు కాంగ్రెస్ నాయకులు మబ్బు దేవనారాయణరెడ్డి ఉన్నారు. ధర్నాలో ఉద్యోగ సంఘాల నాయకులు చాడా మధుసూదన్, వెంకటరమణారెడ్డి, నాగార్జున, కల్పన, లక్ష్మీనారాయణ. సుబ్రమణ్యం, మోహన్‌రెడ్డి, మహీధర్‌రెడ్డి, మునిరెడ్డి, వెంకటేష్, పూజారి రత్న ప్రభాకర్‌తోపాటు పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.
 
ఉద్యోగులతో ఈవో చర్చలు సఫలం
ఉద్యోగులు చేపట్టిన ఆందోళనతో టీటీడీ యాజమాన్యం రంగంలోకి దిగింది. టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ శుక్రవారం ఉద్యోగ సంఘాలతో భేటి అయ్యారు. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. టీటీడీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హమీ ఇవ్వడంతో పాటు అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు.

ఉద్యోగ సంఘాల నుంచి వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, ఇందిర, ఉమామహేశ్వ రెడ్డి, మునికుమార్‌తో కమిటీ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రంలోపు కమిటీ విచారణ చేపట్టి ఉద్యోగులకు జరిగిన అన్యాయాలపై తుది నివేదికను అందజేస్తే న్యాయం చేస్తామని ఈవో హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు ధర్నా నిలిపివేసి విధులకు హజరయ్యారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)