నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ట్యాంకర్ ఢీకొని ఇద్దరు మహిళల మృతి
Published on Thu, 05/28/2015 - 09:20
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వద్ద గురువారం ఉదయం 7 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. తణుకు మండలం కేతలి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రెండు బైక్లపై ద్వారకాతిరుమల క్షేత్రానికి బయలు దేరారు. మార్గమధ్యలో పెద్ద తాడేపల్లి వద్ద ఒక బైక్ టైరు పంక్చర్ అయింది. దీంతో పురుషులిద్దరూ బైక్లను రోడ్డు పక్కన నిలిపి, మరమ్మతు చేస్తుండగా మహిళలు ఇద్దరు డివైడర్పై కూర్చున్నారు. అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ వేగంగా డివైడర్పై కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ ఇద్దరు ధనలక్ష్మి(45), గీతాభవాని(35) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. చనిపోయిన ఇద్దరూ అత్తాకోడళ్లు.
#
Tags