amp pages | Sakshi

నీరుగారిన లక్ష్యం

Published on Fri, 03/14/2014 - 03:56

 ప్రజల దాహార్తి తీర్చని ఆత్మకూరు-ఆనందపురం మంచినీటి పథకం
 కందుకూరు మండలంలో 8 గ్రామాలు, ఉలవపాడులో 6 గ్రామాలకు అందని నీరు
 * 10 కోట్లు ఖర్చు చేసినా నెరవేరని పాలకుల లక్ష్యం
 మెయింటెనెన్స్ ఖర్చు నెలకు * 90 వేలకుపైనే
 అధికారులు, కాంట్రాక్టర్‌పై దుమ్మెత్తి పోస్తున్న ఆయా గ్రామాల ప్రజలు
 

 కందుకూరు రూరల్, న్యూస్‌లైన్ : వేసవి ముంచుకొస్తోంది. మంచినీటి పథకాలు మరమ్మతులకు గురై ప్రజలు అల్లాడుతున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన పథకాలు అలంకార ప్రాయంగా మారాయి. మూలకు చేరిన మోటార్లు, పైపులైన్ల పునరుద్ధరణకు కాంట్రాక్టర్ల చర్యలు శూన్యం. పథకాల మెయింటినెన్స్ ఖర్చుల పేర నిధులు మాత్రం కొంద రి జేబుల్లోకి వెళ్తున్నాయి.
 
  ప్రజల దాహార్తి తీర్చడంతో అటు అధికారులు, ఇటు పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. భారీ మంచినీటి ప్రాజెక్టు రాకతో పంచాయతీల్లోని మంచినీటి పథకాలు మూలనపడ్డాయి. కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, కందుకూరు మండలాల ప్రజల దాహార్తి తీర్చేందుకు * 10 కోట్లతో నిర్మించిన ఆత్మకూరు-ఆనందపురం మంచినీటి పథకం నిరుపయోగంగా మారుతోంది. మోటార్లను సకాలంలో మరమ్మతులు చేయించడంలో అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
 
 ఇదీ.. పథకం లక్ష్యం
 ఉలవపాడు, కందుకూరు మండలాల్లోని 42 గ్రామాలకు మంచినీరు సరఫరా చేసేందుకు ఉలవపాడు మండలం ఆత్మకూరు పంచాయతీలోని చినిగేవారిపాలెం సమీపంలో మన్నేరు వద్ద మంచినీటి పథకాన్ని నిర్మించారు. ఉలవపాడు మండలంలో 34, కందుకూరు మండలంలో 8 గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించారు. 2011లో పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ప్రారంభం నుంచి మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెప్తున్నారు. కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడి పైపులైన్లు సక్రమంగా నిర్మించకపోవడంతో కరేడు పంచాయతీలోని కొన్ని గ్రామాలకు నీటి సరఫరా తొలి నుంచే నిలిచిపోయింది.
 
  ఇలా ఉలవపాడు మండలంలో సుమారు 6 గ్రామాలకు ఇప్పటి వరకూ నీరు సరఫరా కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ట్యాంకులు నిర్మించినా నీరు సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. పైపుల నిర్మాణం సమయంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ తన ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపట్టి చేతులు దులుపేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
 
 అలంకారప్రాయంగా ట్యాంక్‌లు
 కందుకూరు మండలంలో ఆనందపురం, శ్యామీరపాలెం గ్రామాల్లో ఏర్పాటు  చేసిన మంచినీటి పథకం ఓవర్‌హెడ్ ట్యాంకులు అలంకార ప్రాయంగానే మిగిలాయి. 2011లో ట్యాంకు నిర్మిస్తే ఇప్పటి వరకూ చుక్క నీరు ట్యాంక్‌కు ఎక్కలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారురు.
 
 వాస్తవానికి  అన్ని బజార్లలో పైపులు వేయాల్సి ఉండగా అరకొర వేసి మమ అనిపించారు. ఆనందపురం, చుట్టుగుంట, గళ్లవారిపాలెం, దివివారిపాలెం, గనిగుంటలలో నిర్మించిన ట్యాంక్‌ల పరిస్థితీ అంతే. దివివారిపాలేనికి అరకొర నీరు వస్తున్నా సరఫరా సక్రమంగా లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక గనిగుంటలోని ఓవర్‌హెడ్ ట్యాంకుకు పైపుల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది.
 
 నెలనెలా ఖర్చు తడిసి మోపెడు: పథకం మెయింటినెన్స్‌కు నెలకు * 90 వేలకుపైగానే ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులను పథకం ఆపరేటర్, ఆయా గ్రామాల్లోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల వద్ద వారికి జీతాలు, పైపులైన్ల మరమ్మతులకు ఖర్చు చేస్తున్నారు. కందుకూరు మండలంలోని ఎనిమిది గ్రామాలకు పైపు లైన్లు సక్రమంగా లేవు. లీకులతో నీరు వృథా అవుతోంది.  
 
 
 20 రోజుల నుంచి నిలిచిన నీటి సరఫరా
 మన్నేరులో నిర్మించిన పథకానికి సంబంధించిన మోటార్ల మరమ్మతులకు గురయ్యాయి. 20 రోజులు గడుస్తున్నా అధికారులు, కాంట్రాక్టర్ పట్టించుకోలేదు.  కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం. దీంతో ఆయా గ్రామాల ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. కొందరు పట్టణ ప్రాంతాలకు వెళ్లి నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఉప్పునీటినే తాగే పరిస్థితి ఏర్పడింది.  
 
 మరమ్మతులు చేయిస్తున్నాం: రాజశేఖర్, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్, ఉలవపాడు
 పథకానికి సంబంధించిన మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని ఎప్పటికప్పుడు బాగు చేయిస్తున్నాం. రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తవుతాయి. పథకం పరిధిలోని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయిస్తున్నాం.           
 

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)