amp pages | Sakshi

పెంచి.. పంచుకుందాం!

Published on Thu, 11/07/2013 - 02:13

‘చిత్తూరు మంచినీటి’ టెండర్లలో గోల్‌మాల్!
చక్రం తిప్పుతున్న ముఖ్యనేత సోదరుడు
రూ. 2,300 కోట్ల విలువైన మొదటి దశ పనులకు టెండర్ల ఆహ్వానం
వాస్తవ వ్యయానికి 45 శాతం పెంచి అంచనా వ్యయం ఖరారు చేశామని వెల్లడి
ఇందులో 15% చొప్పున కనీసం రూ.300 కోట్ల కమీషన్ ఇవ్వాలని డిమాండ్
టీడీపీ ఎమ్మెల్యేకి సన్నిహితుడైన బడా కాంట్రాక్టర్‌తో కలిసి కాంట్రాక్టర్లతో సంప్రదింపులు
తెలంగాణ బిల్లు సందట్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు హడావుడి
 
సాక్షి, హైదరాబాద్:
చిత్తూరు మంచినీటి ప్రాజెక్టు టెండర్లలో భారీ గోల్‌మాల్ చోటు చేసుకుంటోందా? రూ.2,300 కోట్ల విలువైన మొదటిదశ పనులకు హడావుడిగా టెండర్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వ పెద్దలు తహతహలాడుతున్న తీరు చూస్తే ఈ అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పనులకు వాస్తవంగా అయ్యే వ్యయం కంటే 45 శాతం ఎక్కువగా అంచనా వ్యయం నిర్ణయించామని కాంట్రాక్టర్లకు చెబుతూ కనీసం రూ.300 కోట్లు కమీషన్ల రూపంలో ఇవ్వాలని ముఖ్యనేత సోదరుడు డిమాండ్ చేస్తున్నారని ఉన్నతాధికారవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యనేత సోదరునితో పాటు ఓ టీడీపీ ఎమ్మెల్యేకు సన్నిహితుడైన మరో కాంట్రాక్టర్ ఈ టెండర్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. వారి సూచనల మేరకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు వీలుగా టెండర్, ఆర్థిక నిబంధనలు, అనుభవం వంటి నియమాలను ఖరారు చేయాలని ప్రభుత్వ పెద్దలు సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.  
 
అంచనా కంటే 45 శాతం పెంపు!
తెలుగుగంగ ప్రాజెక్టులో భాగమైన కండలేరు రిజర్వాయర్ నుంచి చిత్తూరు జిల్లావ్యాప్తంగా మంచినీటి సరఫరాకు గాను రూ.4,300 కోట్లు వ్యయం కాగల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతిని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. దీంతో మొదటిదశ పనులకు టెండర్లను ఆహ్వానించారు. పైప్‌లైన్  వేయడం, ప్రధాన ట్రంక్ పైప్‌లైన్, సెకండరీ ట్రంక్ పైప్‌లైన్ పనులకు గాను ఈ టెండర్లను పిలిచారు. ఈ నెల 20వ తేదీన గడువు ముగిసిన తర్వాత 21వ తేదీన టెక్నికల్ బిడ్‌లు తెరవనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యనేత సోదరుడితో పాటు టీడీపీ ఎమ్మెల్యేకు సన్నిహితుడైన కాంట్రాక్టర్ రంగంలోకి దిగారు. పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్న కాంట్రాక్టర్లతో సంప్రదింపులు మొదలుపెట్టారు. పనుల విలువను వాస్తవ వ్యయం కంటే 45 శాతం మేరకు కృత్రిమంగా పెంచి అంచనా వ్యయం రూపొందించామని, అందువల్ల ఇందులో 15 శాతం వరకు కమీషన్ రూపంలో ఇవ్వాలని ముఖ్యనేత సోదరుడు కాంట్రాక్టర్లను డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అంతేగాకుండా టెండర్ పొందిన తరువాత స్వయంగా పనులు చేపట్టకుండా ఇతరులకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ ఎలాంటి నష్టమూ ఉండబోదని, 25% వరకు లాభం వస్తుందని భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. ఎలాంటి అనుమానాలూ రాకుండా పనుల అంచనా విలువ కన్నా ఒకటి లేదా రెండు శాతం మేర తక్కువకు టెండర్‌ను కోట్ చేయాలని కూడా ముఖ్యనేత సోదరుడు కాంట్రాక్టర్లకు సూచించారు. ఇందుకు అంగీకరించిన  కాంట్రాక్టర్లను సిండికేట్‌గా ఏర్పాటు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యేకు సన్నిహితుడైన కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ సిండికేట్‌లోని కాంట్రాక్టర్లే ప్రాజెక్టు టెండర్లలో భాగస్వాములయ్యేలా ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన బిల్లు కార్యరూపం దాల్చేలోగా సందట్లో సడేమియాలా ఈ ప్రాజెక్టు టెండర్లను ఖరారు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
 
అనుకూల అధికారుల నియామకం
ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా టెండర్ల వ్యహారాన్ని నడిపించేందుకే ఇటీవల సంబంధిత శాఖలో అనువైన అధికారులను నియమించారని, అలాగే పదవీ విరమణ చేయాల్సిన ఇంజనీర్ ఇన్ చీఫ్ పదవీ కాలాన్ని పొడిగించారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామీణ మంచినీటి శాఖ ఇంజనీరింగ్ విభాగంలో అనుభవజ్ఞులైన అధికారులున్నప్పటికీ పట్టించుకోకుండా చిత్తూరు మంచినీటి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను మౌలిక వసతుల కల్పన శాఖకు అప్పగించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)