amp pages | Sakshi

ఫైలీన్ పరిహారం అందేదెన్నడో?

Published on Thu, 11/28/2013 - 00:04

జహీరాబాద్, న్యూస్‌లైన్:  నియోజకవర్గంలో అక్టోబర్ నెల చివరి వారంలో వచ్చిన ఫైలీన్ తుఫాన్ నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులకు హెలిన్ తుఫాన్ రూపంలో మరో దెబ్బ పడింది. దీంతో అన్నదాతలు పంటలు చేతికందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, రాయికోడ్ మండలాల్లో 12,927 హెక్టార్లలో రైతు లు పత్తి పంటను సాగు చేసుకున్నారు. ఎకరా పత్తి పంట సాగు కోసం సుమారు రూ. 30 వేలకు పైగా ఖర్చు చేశారు.

పంట బాగా వస్తే ఎకరాలకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే పత్తి పంట సాగు సమయంలో అంటే జూన్‌లో వర్షాలు విరివిగా పడ్డాయి. దీంతో పంట ఎదుగుదల కొంత మేర దెబ్బతింది. దీం తో తరువాత అకాల వర్షాలు కూడా పంటను దెబ్బతీశాయి. దీనికి తోడు అక్టోబరు నెల చివరి వారంలో ఫైలీన్ తుఫాన్ దెబ్బకు పంట దాదాపు దెబ్బతింది. దీంతో ఎకరాలకు పత్తి 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో మొక్కకు ఐదు కాయలకు మించి కాత లేని పరిస్థితి కూడా ఉందని రైతులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. అయితే రెండు రోజుల క్రితం కురిసిన హెలిన్ తుఫాన్ కారణంగా పూత మొత్తం రాలిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పత్తి పంటపై పెట్టిన పెట్టుబడులు ఒక్క పైసా కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. కాత కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో రైతులకు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పంట నష్టాన్ని ప్రభుత్వం, అధికారులు ఎందుకు పరిగణలోకి ఎందుకు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధిక వర్షాల కారణంగా పత్తి పంట ఎదగకుండా పోయిందని, చివరి దశలో ఉన్న వర్షాలు కూడా ఉన్న కొద్ది పంటను కూడా దెబ్బ తీశాయని అన్నదాత లు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు. చివరి దశలో వచ్చిన వర్షాలు పంటలో అంతర కృషి చేసేందుకు వీలు లేకుండా చేసిందని వారు పేర్కొంటున్నారు.

దీంతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిని అప్పుల ఊబిలోకి నెట్టిందని వాపోతున్నారు. అయినా పరిహారం కిందకు పత్తిపంటను తీసుకోక పోవడంతో ప్రభుత్వం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంపై సీఎం వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు.
 ప్రభుత్వం తీరు పరిహాసం
 పత్తి పంటను సాగు చేసుకున్న రైతాంగం విషయంలో ప్రభుత్వం తీరును పలువురు తప్పుపడుతున్నారు. చేతికి అంది వచ్చిన పంట దెబ్బతింటేనే పరిహారం అంటూ మెలికలు పెట్టడం పత్తి రైతులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫైలీన్ తుపాన్ ప్రభావంతో 70 శాతానికి పైగా పత్తి పంట పూత నేల రాలింది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు పత్తిపంట నలుపు రంగు మారింది. మరి ఇది నష్టం కిందకు ఎందుకు రాదో చెప్పాలని రైతాంగం ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మేధావులను ప్రశ్నిస్తోంది. పత్తి పంటను నష్టం కింద గుర్తించకుండా ప్రభుత్వం తమతో పరిహాసం ఆడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)