కదిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ
Breaking News
మహిళలపై చంద్రబాబు ఆగ్రహం
Published on Sun, 03/08/2015 - 15:09
నెల్లూరు : ఏపీ సీఎం చంద్రబాబుకు అంగన్ వాడీ మహిళలు షాకిచ్చారు. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందించిన మహిళలను సత్కరించారు. సత్కారం పొందిన మహిళలో జయా ఫిలిప్స్, సామాజిక కార్యకర్త చెన్నుపాటి విద్య, సినీ నేపథ్య గాయనీమణులు ఎల్ఆర్ ఈశ్వరి, సునీత, అలనాటి మేటి నటి షావుకారు జానకి, ప్రసిద్ధ రచయిత్రి వోల్గా, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ తదితరులు ఉన్నారు.
కాగా ఈ సందర్భంగా సీఎం సభకు హాజరైన అంగన్ వాడీ మహిళలు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న ఏపీ సీఎం చంద్రబాబు అంగన్ వాడీ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చాలా సమస్యలు ఉన్నాయని, ఇలాంటి ఆందోళనలు సరికావని చంద్రబాబు మహిళలపై మండిపడ్డారు.
Tags