amp pages | Sakshi

నష్టపోయిన పంటలకు అదనంగా 15 శాతం సాయం

Published on Wed, 08/28/2019 - 03:58

సాక్షి, అమరావతి: వరదలు, భారీ వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ప్రస్తుతం ఇస్తున్న పరిహారానికి అదనంగా 15 శాతం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణా, గోదావరి తదితర నదులకు వచ్చిన వరదల వల్ల ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలకు జరిగిన నష్టం, తీసుకున్న చర్యలు, అందించాల్సిన సాయం తదితర అంశాలపై మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో వైఎస్‌ జగన్‌  మాట్లాడారు. వరదల కారణంగా నష్టపోయిన వివరాలను సమీక్ష ప్రారంభంలో మంత్రులు, వ్యవసాయ, ఉద్యాన సహా వివిధ శాఖల అధికారులు సీఎంకు నివేదించారు. కృష్ణా నది వరదలతో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బాగా దెబ్బతిందని, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పామర్రు, పెనమలూరులో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. విజయవాడ, మరికొన్ని ప్రాంతాల్లో పంట ముంపు బారిన పడిందని అధికారులు నివేదించారు. 

సాయం నేరుగా రైతులకు మాత్రమే అందాలి
పంట నష్టాన్ని బ్యాంకులు మినహాయించుకోకుండా రైతుల అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాలకే ఇన్‌పుట్‌ సబ్సిడీ వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ప్రస్తుతం వివిధ పంటలకు ఇస్తున్న పరిహారాన్ని (తక్షణ సాయాన్ని) 15 శాతం పెంచాలని ఆదేశించారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని నిరూపించాలన్నారు. భూసార పరీక్షలు జరగాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. వీటి నాణ్యతను గుర్తించడానికి ప్రతి నియోజకవర్గంలో పరీక్ష కేంద్రాలు (ల్యాబ్స్‌) ఏర్పాటు చేయాలని, గ్రామ సచివాలయాల్లో కౌలు రైతులకు కార్డులు ఇవ్వాలని, కౌలు రైతుల చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. దీనిపై వలంటీర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కల్తీ, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమాలన్నీ వచ్చే నాలుగైదు నెలల్లో కార్యరూపం దాల్చాలన్నారు. పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే సలహాలు, పరిష్కారాల కోసం కాల్‌సెంటర్, ఒక యాప్‌ను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటరమణ, పేర్నినాని, మేకతోటి సుచరిత, కొడాలి నాని, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మధుసూదన్‌రెడ్డి, హెచ్‌.అరుణ్‌కుమార్, చిరంజీవి చౌదరి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ధనుంజయరెడ్డి, ప్రకృతి విపత్తుల విభాగం అధికారులు పాల్గొన్నారు.

సబ్సిడీపై మినుములు, పెసలు
రాష్ట్రంలో తొలిసారిగా మినుములు, పెసలు పూర్తి సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యాన పంటలకు సుమారు రూ.228 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. రైతులకు నిరంతరం సేవలందించే కాల్‌ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, వరద ప్రాంతాల్లో సబ్సిడీపై సరఫరా చేసే మినుము, పెసర, వరి వంగడాలను ఇప్పటికే ఆయా ప్రాంతాలకు పంపామని వ్యవసాయాధికారి అరుణ్‌కుమార్‌ వివరించారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)