రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
వన్నరప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
Published on Wed, 02/25/2015 - 13:59
అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన బుధవారం కూడా కొనసాగుతోంది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతలకు మనోధైర్యాన్ని ఇవ్వడమే లక్ష్యంగా వైఎస్ జగన్ చేపట్టిన 'రైతు భరోసా యాత్ర'కు విశేష స్పందన లభిస్తోంది. వ్యవసాయం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా...ప్రాణాలొదిలిన రైతులను ఆయన పరామర్శిస్తున్నారు.
గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం ఎద్దులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నరప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ ఈరోజు ఉదయం పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా అదే మండలంలోని అనుంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న ఓబన్న అనే రైతు కుటుంబాన్నికూడా వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
Tags