రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
66వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
Published on Fri, 01/19/2018 - 19:53
సాక్షి, చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. 66వ రోజు పాదయాత్రను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగించనున్నారు. శనివారం ఉదయం సదాశివపురం క్రాస్రోడ్డు నుంచి 66వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ మొదలుపెట్టనున్నారు.
కుక్కలవారి కండ్రిగ నుంచి వెంకటాపురం, కుమ్మరమిట్ట, మోదుగుపాలెం క్రాస్, కొత్తవీరాపురం, అగ్రహారం, కొబాక, అంజిమేడు క్రాస్, ఏర్పాడు, మేర్లపాక క్రాస్ మీదుగా చిందేపల్లి వరకు కొనసాగనుంది. కొత్తవీరాపురం, మేర్లపాక హరిజనవాడలో వైఎస్సార్సీపీ జెండాను జగన్ ఆవిష్కరించనున్నారు. రాత్రికి చిందేపల్లిలో వైఎస్ జగన్ బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Tags