అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
264వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
Published on Sun, 09/16/2018 - 20:23
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 264వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం వైఎస్ జగన్ భీమిలి నియోజకవర్గంలోని గుమ్మడివాని పాలెం నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నీలకుండీల జంక్షన్, మిందివాని పాలెం, గుడిలోవ జంక్షన్ మీదుగా తర్లువాడ క్రాస్ వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం ఎల్వీ పాలెం మీదుగా ఆనందపురం జంక్షన్ వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: వైఎస్ జగన్ 263వ రోజు పాదయాత్ర ఆదివారం గుమ్మడివాని పాలెం వద్ద ముగిసింది. నేడు జననేత పాదయాత్ర ఎస్ఆర్ పురం కాలనీ, దబ్బండ క్రాస్, ఎస్ఆర్ పురం క్రాస్, సత్తరువు బొంతువాని పాలెం, సొంఠ్యాం జంక్షన్, దిబ్బడి పాలెం జంక్షన్ మీదుగా గుమ్మడివాని పాలెం వరకు 9.5 కిలోమీటర్లు సాగింది. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 2,960.4 కిలోమీటర్లు నడిచారు.
Tags