amp pages | Sakshi

చంద్రబాబు పాలనపై అంతటా అసంతృప్తి

Published on Mon, 12/21/2015 - 01:33

 ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు, నిరుద్యోగులు, మహిళలు నిరాశకు గురై ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు బొత్సా సత్యనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు, దందాలు చేస్తున్నారని విమర్శించారు.
 
 15 నెలల వారి పాలనలో రాష్ట్రంలో అధికారులు, మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కాల్‌మనీ పేరుతో టీడీపీ నాయకులు మహిళలను వ్యభిచార కూపంలోకి దింపడం దురదృష్టకరమన్నారు. మహిళల అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వడ్డీలేని రుణాలు అందించారని, చంద్రబాబు అసలు రుణాలు ఇవ్వకుండా మహిళల జీవనంపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. అంగన్‌వాడీలు ఆందోళన చేస్తే వారిని మగ పోలీసులతో ఈడ్పించి వేయడం అత్యంత హేయమన్నారు.
 
 శాసన సభ సమావేశాల్లో తమ సమస్యల పరిష్కారంపై చర్చిస్తారని ఆశించిన వర్గాలను ఈ సర్కారు నిరాశపరిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిణామాలు, ఒకప్పుడు దేశంలోని నాగాలాండ్, మేఘాలయ, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాల్లా ఉన్నాయన్నారు. ఇటీవల నిర్వహించిన జన చైతన్య యాత్రల వల్ల ప్రజలకు ఒరిగిందేమిటని బొత్స ప్రశ్నించారు. ప్రజలు చైతన్యవంతమై సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసిన విధానం దురదృష్టకరమన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళి, నగర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.జాన్ గురునాథ్, పి.ప్రసాద్, ఎం.సదానంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌