amp pages | Sakshi

ఉనికి కాపాడుకునేందుకే టీడీపీ దీక్షలు

Published on Wed, 07/11/2018 - 08:56

అనంతపురం టౌన్‌: ఉనికిని కాపాడుకునేందుకే టీడీపీ దీక్షలు చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనపై జూలై 2న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ విజయవంతం కావడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేక నిరసన దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరలేపారన్నారు.  కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి చేసిన మోసంపై నాలుగేళ్లల్లో ఏనాడూ విమర్శలు చేయని టీడీపీ నేతలు..ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. టీడీపీ ఎన్నిడ్రామాలు ఆడినా... ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవ సమస్యగా మారిన ప్రత్యేక హోదా సాధన కోసం  నాలుగేళ్లుగా దశల వారీగా ఉద్యమాలు చేపట్టిన ఘనత ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.

రాష్ట్రాభివృద్ధి కోసం 29సార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన చంద్రబాబు... గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకువచ్చాడో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల ఆందోళనలు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే ఆవహేళనగా మాట్లాడిన చంద్రబాబుకు... దీక్షలు చేసే నైతికహక్కు లేదన్నారు. రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించి కేంద్రంపై పోరాటం సాగించాలన్నారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా మోసం చేసిన బీజేపీ, టీడీపీలకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నరన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, జిల్లా అధికార ప్రతినిధి చింత కుంట మధు, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు మారుతి    ప్రకాష్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

Videos

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?