amp pages | Sakshi

‘ఏ క్షణంలో ఎన్నికలైనా మేము సిద్ధం’

Published on Fri, 03/06/2020 - 20:02

సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ శుక్రవారం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ, టీడీపీలతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌, బీఎస్పీ, జనసేన పార్టీల నేతలు హాజరు అయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ తరపున ఎమ్మెల్యే జోగి రమేష్‌ హాజరు అయ్యారు.

సమావేశం అనంతరం ఎమ్మెల్యే జోగి రమేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలో ఎన్నికలు నిర్వహించినా వైఎస్సార్‌ సీపీ సిద్ధంగా ఉందన్నారు. మద్యం, నగదుకు ప్రభావితం కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొన్ని పార్టీలు ఎన్నికలంటే భయపడుతున్నాయని, అందుకే కరోనా వైరస్‌ అంటూ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆపాలని టీడీపీ కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. బీసీలను మోసం చేసే చంద్రబాబు నాయుడు 23 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై కోర్టులో పిటిషన్‌ వేసిన బిర్రు ప్రతాప్‌రెడ్డి టీడీపీ నేత అనేది ప్రజలుకు తెలుసు అని అన్నారు.

ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని బీజేపీ నాయకుడు పాతూరి నాగభూషణం సూచించారు. మద్యం, ధన ప్రభావం లేకుండా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఎం నేత వెంకటేశ్వర రావు తెలిపారు. తమ పార్టీ కూడా ఇదే స్టాండ్‌పై ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై పరిశీలించాలని కోరుతున్నట్లు సీపీఐ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్షన్‌ పేర్కొన్నారు. పరీక్షలు సమయంలో స్థానిక ఎన్నికల నిర్వహణ పరిశీలన చేయాలని, వీలైతే ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన కోరినట్లు తెలిపారు. అదే విధంగా ఎన్నికలు నిర్వహణ కు ఇది సరైన సమయం కాదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. కరోనా వైరస్ ప్రభావము ఉందని, రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండగా ఎలా నిర్వహిస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)