amp pages | Sakshi

జిల్లాకు 16 సార్లు వచ్చి ఏం చేశావు?

Published on Mon, 12/17/2018 - 13:34

ప్రకాశం, కనిగిరి: టీడీపీ అధికారంలోకి వచ్చే నాలుగున్నరేళ్లు దాటింది.. సీఎంగా చంద్రబాబు 16 సార్లు జిల్లాకు వచ్చారు.. శిలాఫలకాలు వేయడం తప్పా ప్రజకిచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదంటూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. రాజన్న జల సంకల్పం కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ సొంత నిధులతో ఏర్పాటు చేసిన డీప్‌బోర్‌వెల్స్, ట్యాంకులను ఆదివారం ప్రారంభించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నాలుగున్నరేళ్ల పబ్బం గడుపుకుని మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తుంటే మళ్లీ ఇప్పుడు వెలిగొండ గూరించి మాయ మాటలు చెప్తున్నాడని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టుపై ప్రజలను టీడీపీ నేతలు ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలియజేసేందుకు తాను ఆగస్టులో ఐదు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టినట్లు వైవీ గుర్తు చేశారు. ప్రజలు టీడీపీ మాయమాటలు నమ్మె పరిస్థితిలో లేరన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్టుకును పూర్తి చేసి పశ్చిమ ప్రాంతాలైన కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండపి నియోజకవర్గాలకు తాగు, సాగు నీటి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో వైఎస్సార్‌ సంక్షేమ పాలలు ప్రజలకు అందిస్తామని వివరించారు. 

13 నీటి ట్యాంకుల ప్రారంభం
మున్సిపాలిటీలో నీటి సమస్య పరిష్కారానికి రాజన్న జల సంకల్పంలో భాగంగా బుర్రా సొంత నిధులు రూ.8 లక్షలతో కాశీపురం, అర్బన్‌ కాలనీ, రాజీవ్‌ కాలనీ, శివనగర్‌ కాలనీల్లో (1,2,11,10 వార్డుల్లో) ఏర్పాటు చేసిన డీప్‌బోర్‌వెల్‌ నీటి ట్యాంకులను బుర్రాతో కలిసి మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ కనిగిరి, కొండపి ప్రాంతాల్లో కిడ్నీ, ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కిడ్నీ, ఫ్లోరైడ్‌ సమస్యలపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో ప్రభుత్వం కళ్లు తెరపించి డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తన సొంత నిధులతో డీప్‌ బోర్‌వెల్, ట్యాంకులు నిర్మించి తాగు నీటి సమస్య తీర్చేందుకు బుర్రా కృషి చేయడాన్ని కొనియాడారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందించి పనిచేస్తున్నారనేందుకు బుర్రా చేస్తున్న కృషే నిదర్శనమన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా ప్రజలు తమ నీటి సమస్యను తెలపగానే ట్యాంకులు, బోర్‌వెల్స్‌ ఏర్పాటు చేస్తూ దాహార్తీ తీర్చుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటేయాలని మాజీ ఎంపీ వైవీ కోరారు. జెడ్పీటీసీ సభ్యుడు ప్రకాశం, ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, పార్టీ నాయకులు రంగనాయకులు, వేల్పుల వెంకటేశ్వర్లు, బజాజ్‌ బుజ్జి, గోనా సదానందం, కోటిరెడ్డి, పెద్దిరెడ్డి, తిరుపతయ్య పాల్గొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)