నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
ఆధార్లో కొత్త ఫీచర్
Published on Mon, 01/15/2018 - 14:36
సాక్షి, న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) కొత్త ఫీచర్ను ప్రకటించింది. ఆధార్ వినియోగదారులకు ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ను జోడిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ కొత్త పద్ధతి జూలై 1, 2018 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. ఈ మేరకు యుఐడిఎఐ ఒక సర్క్యులర్ జారీ చేసింది.
ఆధార్ ధృవీకరణకు మరో కొత్త ప్రముఖమైన టెక్నాలజీని జోడిస్తున్నామని యుఐడిఎఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఫ్రింగర్ ప్రింట్ తో ఇబ్బందులుపడుతున్న వృద్ధులు తదితరులకు ఇది బాగా ఉపయోగపడుతుందని ఆయన ట్విటర్లో తెలిపారు.
@UIDAI introduces yet another landmark technology for authentication - Face Authentication. #AadhaarFaceAuth will help all elderly or others facing issues with fingerprint authentication. Service to be launched by 1 July 2018.
— CEO UIDAI (@ceo_uidai) January 15, 2018
Tags