amp pages | Sakshi

బ్యాంకుల్లో 33 శాతానికి వాటా తగ్గించుకోవాలి

Published on Mon, 12/18/2017 - 02:11

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) కేంద్ర ప్రభుత్వం తన వాటాను రానున్న రెండు మూడేళ్లలో 33 శాతానికి తగ్గించుకోవాలని సీఐఐ డిమాండ్‌ చేసింది. మొండి బకాయిల సమస్యతో కుదేలవుతున్న పీఎస్‌బీలకు కేంద్రం రీక్యాపిటలైజేషన్‌ సాయం చేస్తున్న నేపథ్యంలో సీఐఐ ఈ సూచన చేసింది. తక్షణ ప్రాదిపదికన ప్రభుత్వం తన వాటాను 52 శాతం వరకు తగ్గించుకునేందుకు పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే అవకాశాన్ని పరిశీలించాలని, 33 శాతానికి తగ్గించుకోవడం వచ్చే మూడేళ్ల కాలానికి లక్ష్యంగా పెట్టుకోవాలని సీఐఐ తన ప్రకటనలో పేర్కొంది.

ప్రాధాన్య అవసరాల రీత్యా ఎస్‌బీఐలో గణనీయమైన వాటాను ప్రభుత్వం ఉంచుకోవచ్చని అభిప్రాయపడింది. వాటాలను తగ్గించుకోవడం అన్నది ఈక్విటీ షేర్ల రూపంలో కాకుండా ప్రిఫరెన్స్‌ షేర్ల రూపంలో ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుతం పీఎస్‌బీల్లో ప్రభుత్వం వాటా 58 శాతం, అంతకంటే ఎక్కువే ఉందని సీఐఐ తెలిపింది. ‘‘చాలా వరకు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సర్కారు వాటా 80 శాతం పైనే ఉంది. కేవలం నాలుగు బ్యాంకుల్లో వాటా ఈ ఏడాది మార్చి నాటికి 58 శాతానికి తగ్గింది.

2018 ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంకులకు నూతన అకౌంటింగ్‌ ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. దీంతో మొండి రుణాలకు కేటాయింపులు 30 శాతం మేర పెంచాల్సి రావచ్చు. ఫలితంగా బ్యాంకులకు నిధుల అవసరాలు పెరుగుతాయి’’ అని సీఐఐ పేర్కొంది. దీంతో బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌కు సంబంధించి సర్కారు ఆరు పాయింట్ల అజెండాను రూపొందించుకోవాలని సీఐఐ సూచించింది. బ్యాంకులకు వచ్చే రెండేళ్ల కాలంలో రూ.2.11 లక్షల కోట్ల మేర పీఎస్‌బీలకు రీక్యాపిటలైజేషన్‌ సాయాన్ని అందించనున్నట్టు కేంద్రం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.   

#

Tags

Videos

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?