కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సహకరిస్తే పెట్టుబడులతో వస్తాం
Published on Sun, 06/08/2014 - 00:36
తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెలను కలసిన సీఐఐ, ఫిక్కీ బృందం
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల విస్తరణకు అవసరమైన మౌలిక వసతులను సమకూరిస్తే పెట్టుబడులు పెడతామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు కలసి ప్రతిపాదించారు. సచివాలయంలోని ఆర్థికమంత్రి చాంబర్లో శనివారం ఆయనను కలసిన ప్రతినిధులు తమ ఇబ్బందులను, పరిష్కారాలను వివరించారు.
పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, పన్నులు, విద్యుత్తు, నీరు, మానవవనరులు వంటివాటి విషయంలో రాయితీలు, ప్రభుత్వ సహకారం ఉంటే లక్షల కోట్లు తెలంగాణకు పెట్టుబడులుగా వస్తాయని చెప్పారు. హైదరాబాద్ నుండి చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో ఫార్మా, హార్డ్వేర్ వంటి భారీ పరిశ్రమలకు అవకాశముందని చెప్పారు.
#
Tags