amp pages | Sakshi

ఈ 12 బ్లూచిప్‌ స్టాక్స్‌ దారెటు?

Published on Thu, 05/28/2020 - 09:40

దేశీ స్టాక్‌ మార్కెట్లు ఇటీవల హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 9200- 8,800 పాయింట్ల మధ్య పరిమిత శ్రేణిలో ఊగిసలాడుతున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచ మార్కెట్లన్నిటా అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీయంగానూ మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో మార్చి నెలలో నిఫ్టీ గరిష్టాల నుంచి 38 శాతం జారింది. తదుపరి ఏప్రిల్‌లో ఒక్కసారిగా బౌన్స్‌బ్యాక్‌ సాధించింది. ఆపై తిరిగి ఈ నెలలో ఒడిదొడుకుల మధ్య వెనకడుగు వేస్తోంది. వెరసి ఇటీవల నమోదైన రికార్డ్‌ గరిష్టం నుంచి చూస్తే ప్రస్తుతం నిఫ్టీ 27 శాతం నీరసించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. నిఫ్టీకి ప్రాతినిధ్యంవహించే దిగ్గజాలలో 12 స్టాక్స్‌ ఇప్పటికీ 50 శాతం దిగువనే కదులుతుండటం గమనార్హం! ఈ బ్లూచిప్స్‌ తమ గరిష్టాల నుంచి చూస్తే కనీసం 50 శాతం క్షీణించి కదులుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో అధిక శాతం బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగం నుంచే చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. 

జాబితా ఇలా
ఏస్‌ ఈక్విటీ గణాంకాల ప్రకారం ఇటీవల నమోదైన 52 వారాల గరిష్టాల నుంచి 12 నిఫ్టీ స్టాక్స్‌ 50 శాతం దిగజారి ట్రేడవుతున్నాయి. వీటిలో ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రూ. 1673 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకగా.. బుధవారానికల్లా రూ. 348కు చేరింది. ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్‌ ఫైనాన్స్‌ ఏడాది గరిష్టం రూ. 4923కాగా.. 60 శాతం పతనమై రూ. 1936ను తాకింది. ఈ బాటలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 58 శాతం పడిపోయి రూ. 4258 వద్ద కదులుతోంది. ఈ షేరు 10,297 వద్ద ఏడాది గరిష్టాన్ని సాధించింది. ఇక పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ సైతం 52 వారాల గరిష్టం రూ. 374 నుంచి 57 శాతం తిరోగమించి రూ. 159 స్థాయికి చేరింది. ఇతర కౌంటర్లలో జీ ఎంటర్‌ప్రైజెస్‌ 59 శాతం వెనకడుగుతో రూ. 406 నుం‍చి రూ. 165కు చేరగా.. టాటా మోటార్స్‌ రూ. 202 నుంచి 59 శాతం పతనమై రూ. 86ను తాకింది. ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ యాక్సిస్‌ రూ. 827 స్థాయి నుంచి 50 శాతం నీరసించి రూ. 387కు చేరగా.. ఇంధన రంగ బ్లూచిప్‌ ఓఎన్‌జీసీ రూ. 176 నుంచి రూ. 78కు జారింది. ఇదే విధంగా పీఎస్‌యూ దిగ్గజం ఐవోసీ 52 వారాల గరిష్టం రూ. 170 నుంచి 55 శాతం కోల్పోయి రూ. 77కు చేరగా.. కోల్‌ ఇండియా రూ. 271 నుంచి 53 శాతం నష్టపోయి రూ. 127ను తాకింది. గెయిల్‌ ఇండియా రూ. 183 స్థాయి నుంచి 52 శాతం క్షీణించి రూ.88కు చేరగా.. వేదాంతా రూ. 180 నుంచి రూ. 88కు పడిపోయింది. 52 వారాల గరిష్టం నుంచి రూ. 51 శాతం పతనమైంది.

పలు కారణాలు
కరోనా వైరస్‌ కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ కారణంగా పలు రంగాలలో కార్యకలాపాలు నిలిచిపోవడం, ఉపాధికి దెబ్బతగలడం, దేశీయంగా తొలిసారి ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్య పరిస్థితులను ఎదుర్కోవలసి రావడం వంటి అంశాలు ప్రతికూల పరిస్థితులకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికాసహా ప్రపంచ దేశాలలో నిరంతరంగా విస్తరిస్తున్న కోవిడ్‌-19 ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు 6-12 నెలల సమయం పట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ప్యాకేజీలు, కేంద్ర బ్యాంకుల లిక్విడిటీ చర్యలు పలు రంగాలకు దన్నుగా నిలుస్తున్నప్పటికీ రెండు, మూడు త్రైమాసికాలలో కంపెనీల పనితీరు దెబ్బతినే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. రుణ చెల్లింపుల వాయిదాలపై ఆరు నెలల మారటోరియం, ఉపాధి కల్పనకు విఘాతం వంటి ప్రతికూలతలతో ప్రధానంగా బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ రంగాలు కుదేలయ్యే అవకాశమున్నట్లు ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఏప్రిల్‌లో ఆటో అమ్మకాలు నిలిచిపోవడం, పలు రంగాలలో ఉత్పత్తి పూర్తిస్థాయిలో పుంజుకోకపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాలపై ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్‌-19 కారణంగా ఇన్వెస్టర్లు పెట్టుబడుల ప్రణాళికల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలియజేశారు. అయితే పటిష్ట బ్యాలన్స్‌షీట్లు, అధిక మార్కెట్‌ వాటా కలిగి, బలమైన యాజమాన్య నిర్వహణలో ఉన్న బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు సైతం భవిష్యత్‌లో పుంజుకునే వీలున్నట్లు తెలియజేశారు.

#

Tags

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)