పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చోళమండలం..తగ్గిన మొండి బకాయిలు
Published on Tue, 04/24/2018 - 00:39
ముంబై: చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.291 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభం (రూ.220 కోట్లు)తో పోల్చితే 33 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది.
నిధుల వ్యయం తక్కువగా ఉండడం, ఫీజు ఆదాయం ఎక్కువగా ఉండడం, మొండి బకాయిలు తక్కువగా ఉండడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎమ్డీ ఎన్. శ్రీనివాసన్ తెలిపారు. స్థూల మొండి బకాయిలు 4.66శాతం నుంచి 2.94 శాతానికి, నికర మొండి బకాయిలు 3.19 శాతం నుంచి 1.66 శాతానికి తగ్గాయని వివరించారు. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్ఈలో ఈ షేర్ ఆల్ టైమ్ హై, రూ.1,714ను తాకింది.
#
Tags