amp pages | Sakshi

దోమ కుట్టకుండా.. రూ.6 వేల కోట్లు!!

Published on Wed, 01/02/2019 - 00:43

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇళ్లలో దోమల నివారణకు ఏటా దేశవ్యాప్తంగా జనం పెడుతున్న ఖర్చెంతో తెలుసా? అక్షరాలా ఆరువేల కోట్ల రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జనాన్ని దోమలు ఎంతలా భయపెడుతున్నాయో చెప్పటానికి ఈ అంకెలు చూస్తే చాలు. అయితే ఇదంతా ఇళ్లలో దోమల నివారణ ఉత్పత్తుల కోసం జనం చేస్తున్న ఖర్చు మాత్రమేనండోయ్‌!!. ఇక  కార్యాలయాలు, షాపులు, వాణిజ్య సముదాయాలు, వీధుల్లో ప్రభుత్వ సంస్థలు చేస్తున్న వ్యయం దీనికి అదనం. దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణకయ్యే ఆసుపత్రి ఖర్చులు, వాటికోసం వాడే మందులు ఈ లెక్కలోకి రావటం లేదు. ఎందుకంటే మలేరియా, డెంగ్యూ, చికున్‌ గున్యాతోపాటు కొత్తగా జికా, వెస్ట్‌ నైల్‌ వంటి  వైరస్‌ల వ్యాప్తికి దోమలు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు ఎందరో!!. అందుకే దోమల నివారణకు ఇళ్లలో లిక్విడ్‌ వేపరైజర్స్, ఏరోసోల్స్, ఇన్సెన్స్‌ స్టిక్స్,  క్రీములు, మ్యాట్స్, ఆయిల్స్‌ వంటి ఉత్పత్తులు వినియోగిస్తున్నారు.  

సగం కుటుంబాల్లో.. 
దోమల నివారణ ఉత్పత్తులు ఇప్పుడు పల్లెలకూ పాకాయి. కిరాణా దుకాణాలు, జనరల్‌ స్టోర్స్, మందుల షాపుల్లో విరివిగా లభిస్తున్నాయి. అటు కంపెనీలు సైతం విభిన్న రకాల్లో వీటిని తయారు చేస్తూ కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. బ్రాండెడ్‌ కంపెనీలు ఈ ఉత్పత్తుల తయారీకి ఏళ్ల తరబడి శ్రమిస్తున్నాయి. పరిశోధన, పరీక్షల అనంతరం వీటిని విడుదల చేస్తున్నాయి. భారత్‌లో 28 కోట్ల కుటుంబాల్లో.. 13.4 కోట్ల కుటుంబాలు అన్‌ బ్రాండెడ్‌ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు గోద్రెజ్‌ కన్సూ్యమర్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా, సార్క్‌ సీఈవో సునీల్‌ కటారియా చెప్పారు. దేశంలో చిన్నాచితకా యూనిట్లు తయారు చేసిన నకిలీ ఇన్సెన్స్‌ (అగర్‌బత్తీలు) వ్యాపారం ఏటా రూ.500 కోట్లు ఉంటోందని ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఇక కాయిల్స్‌ చవకగా దొరుకుతాయి కాబట్టి వీటికి ఎక్కువ గిరాకీ ఉంటోందని వెల్లడించారు. బ్రాండెడ్‌ కంపెనీల కాయిల్స్‌ వ్యాపారం    రూ.2,220 కోట్లుగా ఉంది.  

ఇదీ భారత మార్కెట్‌.. 
దేశవ్యాప్తంగా ఇళ్లలో వాడుతున్న దోమల నివారణ ఉత్పత్తుల మార్కెట్‌ రూ.6,000 కోట్లు. ఏటా ఈ మార్కెట్‌ 10 శాతం వృద్ధి చెందుతోంది. వీటిలో కాయిల్స్‌ వాటా అత్యధికంగా 37 శాతం ఉంది. లిక్విడ్‌ వేపరైజర్స్‌ 34 శాతం, ఏరోసోల్స్‌ 14, ఇన్సెన్స్‌ స్టిక్స్‌ 11 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. మిగిలిన వాటాను క్రీములు, మ్యాట్స్, ఆయిల్స్‌ వంటి ఉత్పత్తులు దక్కించుకున్నాయి. చిత్రమేంటంటే వీటన్నిటిలో టాప్‌–5 బ్రాండ్స్‌ ఏకంగా 80 శాతం మార్కెట్‌ను చేజిక్కించుకున్నాయి. దోమల నివారణ ఉత్పత్తుల రంగంలో గోద్రెజ్‌ కన్సూ్యమర్‌ ప్రొడక్ట్స్, ఎస్‌సీ జాన్సన్, రెక్కిట్‌ బెన్‌కిసర్, జ్యోతి ల్యాబొరేటరీస్, డాబర్‌లు అగ్రశ్రేణి కంపెనీలుగా కొనసాగుతున్నాయి. గోద్రెజ్‌కు చెందిన గుడ్‌నైట్‌ బ్రాండ్‌ ఏటా రూ.2,500 కోట్ల వ్యాపారాన్ని చేస్తూ టాప్‌ వన్‌ స్థానంలో ఉంది 

Videos

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?