amp pages | Sakshi

అస్థిరతల్లోనూ చెదరని విశ్వాసం

Published on Thu, 03/12/2020 - 11:36

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల వల్ల కుదేలవుతుంటే.. పెట్టుబడులకు ఇది చక్కని సమయమని భావించే ధోరణి ఇన్వెస్టర్లలో పెరుగుతోంది. ఇన్వెస్టర్ల పరిణతిని ప్రతిఫలించే విధంగా ఫిబ్రవరి మాసంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నికరంగా రూ.10,730 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే విధంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నుంచి (అన్ని రకాల పథకాల్లో) మొత్తం మీద రూ.1,985 కోట్ల పెట్టుబడులు ఫిబ్రవరిలో బయటకు వెళ్లిపోయాయి. జనవరిలో  మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.1.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక జనవరిలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.7,547 కోట్లు. దీంతో పోలిస్తే ఫిబ్రవరి నెలలో పెట్టుబడులు రాక నికరంగా 42 శాతం పెరిగి రూ.10,730 కోట్లుగా ఉంది. 2019 మార్చిలో రూ.11,756 కోట్ల పెట్టుబడుల తర్వాత ఒక నెలలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన అత్యధిక పెట్టుబడులు మళ్లీ ఫిబ్రవరిలోనే కావడం గమనార్హం. కరోనా వైరస్‌ అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తుండడంతో మన ఈక్విటీ మార్కెట్లు నెల వ్యవధిలోనే 15 శాతం వరకు నష్టపోయిన విషయం తెలిసిందే.

ముఖ్య గణాంకాలు..
సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌/క్రమానుగత పెట్టుబడుల విధానం) రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.8,513 కోట్లు.   
మల్టీక్యాప్‌ పథకాల్లోకి రూ.1,625 కోట్లు, లార్జ్‌క్యాప్‌ పథకాల్లోకి రూ.1,607 కోట్లు, మిడ్‌క్యాప్‌ పథకాల్లోకి రూ.1,451 కోట్లు, స్మాల్‌క్యాప్‌ పథకాల్లోకి రూ.1,498 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు పెట్టుబడులు కుమ్మరించారు.  
ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.871 కోట్లుగా ఉన్నాయి.
గోల్డ్‌ ఈటీఎఫ్‌లు నికరంగా రూ.1,483 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతక్రితం నెలలో వచ్చిన రూ.202 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఈక్విటీల్లో అనిశ్చితితో బంగారం ర్యాలీ చేస్తుండడం తెలిసిందే. దీంతో వరుసగా నాలుగో నెలలోనూ పెరుగుదల నమోదైంది.
ఫిబ్రవరి నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ (పెట్టుబడులు) జనవరిలో ఉన్న రూ.27.86 లక్షల కోట్ల నుంచి రూ.27.23 లక్షల కోట్లకు పరిమితం అయింది.

Videos

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)