amp pages | Sakshi

ఎయిర్‌ ఇండియా ఆస్తుల అమ్మకం

Published on Tue, 12/04/2018 - 01:01

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా రుణ భారం తగ్గించేందుకు కేంద్రం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఎయిర్‌ ఇండియాకు చెందిన భూమి, రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల విక్రయం ద్వారా రూ.9,000 కోట్లను సమీకరించాలన్నది తాజా ప్రతిపాదన. ఎయిర్‌ ఇండియాకు రూ.55,000 కోట్ల మేర రుణ భారం ఉండగా, దీన్ని తగ్గించే ప్రణాళికలో భాగంగా ఆస్తులను విక్రయించాలనుకుంటోంది. దీనివల్ల రుణ భారం తగ్గడంతోపాటు సంస్థ విలువ పెరిగి ఎయిర్‌ ఇండియాను ప్రైవేటు సంస్థకు విక్రయించడం వీలవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఎయిర్‌ ఇండియా రుణాల్లో రూ.29,000 కోట్లను ఎయిర్‌ ఇండియా అస్సెట్‌ హోల్డింగ్‌ కంపెనీ పేరుతో ఓ స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌కు (ఎస్‌పీవీ) బదిలీ చేయాలని గత వారమే కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ప్యానెల్‌ నిర్ణయించింది. ఇక ఎయిర్‌ ఇండియా ఆస్తుల విక్రయంతో వచ్చిన నిధులను ఎస్‌పీవీకి బదిలీ చేసిన రుణాలను తీర్చివేసేందుకు వినియోగిస్తారు. ‘‘ఎయిర్‌ ఇండియా ఆస్తుల విక్రయంతో రూ.9,000 కోట్లను సమీకరించాలనుకుంటున్నాం. ముంబైలోని ఎయిర్‌లైన్స్‌ హౌస్, ఢిల్లీలోని వసంత్‌ విహార్, బాబా ఖరక్‌ సింగ్‌ మార్గ్‌లో ఉన్న రియల్టీ ఆస్తుల విక్రయం ఈ ప్రణాళికలో ఉన్నాయి’’ అని ఓ అధికారి తెలిపారు.  

ఎయిర్‌ ఇండియా ఏటీఎస్‌ఎల్‌ అమ్మకం 
ఎయిర్‌ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐ శాట్స్‌) విక్రయానికి మంత్రివర్గ ప్యానెల్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ విభాగం 2016–17లో రూ.61 కోట్ల లాభాన్ని ఆర్జించింది. దీని అమ్మకంతో వచ్చే నిధుల్ని రుణ భారం తగ్గించేందుకే వినియోగించనుంది. ‘‘ఎయిరిండియా రుణ భారం తగ్గించేందుకు అడుగు తర్వాత అడుగు వేస్తున్నాం. మరోసారి ఎయిర్‌ ఇండియాను వ్యూహాత్మక విక్రయానికి ఉంచితే, ఇన్వెస్టర్లు ముందుకు వచ్చేలా ఉండాలి. ఈ చర్యలన్నీ ఎయిర్‌ ఇండియా విక్రయంలో భాగమే’’ అని సదరు అధికారి తెలిపారు. ఎయిర్‌ ఇండియా గత సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా పలు ఆస్తుల విక్రయానికి బిడ్లను ఆహ్వానించింది. ముంబైలో 28 ఫ్లాట్లు, అహ్మదాబాద్‌లో 7 ఫ్లాట్లు, పుణెలో రెండు ఫ్లాట్లు, ఒక కార్యాలయ వసతి తదితర ఆస్తులు ఇందులో ఉన్నాయి. ఎయిర్‌ ఇండియాలో 76 శాతం ఈక్విటీని, నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలన్నది కేంద్రం ఆలోచన. 

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)