amp pages | Sakshi

ఈ నెల 21నుంచి మిధాని ఐపీఓ

Published on Thu, 03/15/2018 - 00:40

ముంబై: హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక లోహాలు తయారు చేసే ప్రభుత్వ రంగ మినీ రత్న కంపెనీ, మిశ్రధాతు నిగమ్‌(మిధాని) ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 23న ముగిసే ఈ ఐపీఓ ద్వారా  ప్రభుత్వం  రూ.438 కోట్లు సమీకరిస్తుందని  అంచనా. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ రూ.87–90గా ఉంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు అఫర్‌ ధరలో రూ.3 డిస్కౌంట్‌ లభిస్తుంది. డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా ఈ కంపెనీలో 26 శాతం వాటాను ప్రభుత్వం విక్రయిస్తోంది. అందుకని ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులన్నీ ప్రభుత్వ ఖజానాకే వెళతాయని, తమకేమీ రావని మిధాని సీఎమ్‌డీ దినేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఐపీఓలో భాగంగా ప్రభుత్వం 26 శాతం వాటాకు సమానమైన 4.87 కోట్ల షేర్లను ఆఫర్‌ చేస్తోంది. ఈ కంపెనీ స్పెషల్‌ స్టీల్, సూపర్‌ అల్లాయ్స్‌ను  తయారు చేస్తోంది. భారత్‌లో  టైటానియమ్‌ అల్లాయ్స్‌ను తయారు చేసే ఏకైక కంపెనీ ఇదే.

ఈ ఐపీఓకు ఎస్‌బీఐ క్యాప్స్, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి.   1973లో ఈ కంపెనీ ఏర్పాటైంది. వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఉన్న, దేశ రక్షణకు అవసరమైన క్లిష్టమైన లోహాల, ఉత్పత్తుల తయారీ, సరఫరా, పరిశోధనల్లో స్వావలంబన సాధించే లక్ష్యంగా ఈ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ ఉత్పత్తులను వైమానిక రంగం, విద్యుదుత్పత్తి, అణు, రక్షణ, ఇతర సాధారణ ఇంజనీరింగ్‌ పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. రోహ్‌తక్‌లో ఒక ప్లాంట్‌ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వద్ద అల్యూమినియమ్‌ లోహాల తయారీ కోసం  నాల్కోతో కలిసి  రూ.3,500 కోట్ల పెట్టుబడులతో ఒక జాయింట్‌ వెంచర్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది.   గత ఆర్థిక సంవత్సరంలో మిధాని కంపెనీ రూ.810 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.27 కోట్ల నికర లాభం సాధించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రూ.517 కోట్లుగా ఉంది.  

Videos

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)