వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐటీ లేఆఫ్స్: గోరంతైతే, కొండంత చేస్తున్నారు
Published on Thu, 05/25/2017 - 16:38
ఐటీ పరిశ్రమలో ఇటీవల నెలకొన్న లేఆఫ్స్ ఆందోళన తెలిసిందే. భారీ ఎత్తున్న కంపెనీలు ఉద్యోగాలు పీకేస్తున్నారంటూ పలు రిపోర్టులు టెకీల గుండెల్లో దడలు పుట్టిస్తున్నాయి. అయితే ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అతిశయోక్తిగా ఉందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ''పర్ ఫార్మెన్స్ ఆధారంగా సాధారణంగా ఉద్యోగులపై వేటు వేయడం ప్రతి ఇండస్ట్రిలో ఓ అంతర్గత భాగం. దీన్ని మరీ అతిశయోక్తి చేయడం అంత మంచిది కాదు. ఆందోళన చెందడానికి ఎలాంటి కారణాలు లేవు. సాధారణంగా జరిగే ప్రక్రియను కొండంత చేసి చూస్తున్నారు'' అని మంత్రి చెప్పారు.
తమ మంత్రిత్వశాఖ లేఆఫ్స్ పరిస్థితిపై ఎప్పడికప్పుడూ దేశీయ ఐటీ సీఈవోలతో సంప్రదిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో ప్రత్యక్షంగా 40 లక్షల మందికి, పరోక్షంగా 1.6 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు. సాఫ్ట్ బ్యాంకు, అమెజాన్, అలీబాబాలతో దేశీయ స్టార్టప్ స్పేస్ రన్ అవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టంచేశారు. ఇంటర్నెట్ స్పేస్ లో విదేశీ నగదు ఫండింగ్ కు వ్యతిరేకంగా భారత్ ఎలాంటి పక్షపాతం చూపించదని పేర్కొన్నారు.
#
Tags