వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సంక్షోభాలను తట్టుకునే సత్తా పెరిగింది: జైట్లీ
Published on Sun, 04/19/2015 - 02:35
వాషింగ్టన్: భారత్కు ఆర్థిక సంక్షోభాలను తట్టుకుని నిలబడే సత్తా పెరిగిందని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన జైట్లీ, ఈ పర్యటనలో భాగంగా పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విస్తృతమైన మార్కెట్ పరిమాణం, డిమాండ్, కరెన్సీ స్థిరత్వం ప్రస్తుతం భారత్కు కలసి వస్తున్న అంశాలని అన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు పెంచినప్పటికీ, భారత్ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఇబ్బంది ఏదీ ఉండబోదని అన్నారు.
#
Tags