రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వంట గ్యాస్ ధర పెంపు
Published on Tue, 07/31/2018 - 20:39
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. ఎన్డిఏ ప్రభుత్వం ఆధ్యర్యంలో పెట్రోలు, డీజిలు ధరలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో జూలై నెల చివర్లో ఎల్పీజీ సిలిండర్ ధరను మళ్లీ పెంచింది. తాజా పెంపుతో రాయితీ ఉన్న వంట గ్యాస్ సిలిండర్పై ధర రూ.1.76 పెరిగింది. సబ్సిడీ లేని సిలిండర్ ధరను రూ.35.50 లు పెరిగింది. నేటి అర్థరాత్రి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. దీంతో గత నాలుగేళ్లలో 27 సార్లు గ్యాస్ ధరలను పెంచినట్టయింది. గత నెలలో సిలిండర్పై రూ.2.71 మేర ధరను పెంచింది. పేద,మధ్య తరగతి వినియోగదారులు వినియోగిస్తున్న సిలిండర్పై ఇస్తున్న రాయితీని దశలవారీగా తగ్గించే క్రమంలో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.
#
Tags