amp pages | Sakshi

ఫ్లిప్‌కార్ట్‌ ఉద్యోగులకు జాక్‌పాట్‌

Published on Thu, 05/10/2018 - 18:11

సాక్షి, ముంబై:  ప్రపంచ  ఈ కామర్స్‌దిగ్గజం వాల్‌మార్ట్‌ , దేశీయ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మెగా డీల్‌ నేపథ్యంలో ఉద్యోగులు భారీగా లాభపడనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించి 77 శాతం వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన సంగతి విదితమే. ఈ డీల్‌లో భాగంగా స్టాక్‌ బై బ్యాక్‌ ఆప్షన్‌ కింద  ఫ్లిప్‌కార్ట్‌ ఉద్యో‍గులకు జాక్‌ పాట్‌  తగిలినట్టయింది. దీంతొ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కోటీశ్వరులుగా మారిపోనున్నారు.   

 ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ డీల్‌ పిలుస్తున్న ఈ కొనుగోలు  ఒప్పందం ద్వారా   ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేయడం కోసం 50 కోట్ల డాలర్లు (సుమారు రూ.3300 కోట్లు) కేటాయించింది.  ఈ డీల్ పూర్తవగానే ఈఎస్‌ఓపీ (ఎంప్లాయీ స్టాక్ ఓన‌ర్‌షిప్ ప్లాన్‌)  ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు లాభాపడనున్నారు.  తాజా ఒప్పందంతో సీనియర్ సభ్యుల కొందరు   కోటీశ్వరులు కాబోతున్నారని మార్కెటింగ్ టీంలోని  సీనియర్ ఉద్యోగి  ఒకరు వ్యాఖ్యానించారు.   దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్  ఇంకా రాలేదనీ, బహుశా  శుక్రవారం  ఒక ప్రకటన వచ్చే అవకాశ ఉందని భావించారు. ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు మూడేళ్ల వ్యవధిలో తమ షేర్లను నగదు రూపంలోకి మార్చుకోవచ్చని ఆయన వెల్లడించారు.  ఫ్లిప్‌కార్ట్‌కు  చెందిన 200-250మంది, మింత్రాకు చెందిన 150మందికి, జబాంగ్‌లోని మరో 50 మంది ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు చేకూరనున్నట్టు తెలుస్తోంది.  ఫ్లిప్‌కార్ట్‌ కో ఫౌండర్‌ గ్రూప్‌ సీఈవో బిన్ని  బన్సాల్‌  ఎంప్లాయీస్‌ స్టాక్‌ ఆప్షన్లను 100శాతం  బై బేక్‌ చేస్తామని  బుధవారం జరిగిన ఒక సమావేశంలో వెల్లడించారు.  షేర్‌ ధర  సుమారు 10వేల రూపాయల వద్ద ఈ కొనుగోలు ఉండవచ్చని భావిస్తున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)