amp pages | Sakshi

అమెరికా నుంచి మరిన్ని దిగుమతులు!

Published on Tue, 08/27/2019 - 13:21

బియారిట్జ్‌/లండన్‌:   ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా అమెరికా నుంచి దిగుమతులు మరింతగా పెంచుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఇప్పటికే 4 బిలియన్‌ డాలర్ల విలువ చేసే దిగుమతులు తుది దశలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జీ7 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇరువురు భేటీ అయ్యారు. టారిఫ్‌లు, ఆర్థికాంశాలపై వివాదాలతో రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో మోదీ, ట్రంప్‌ వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను, వాణిజ్యాన్ని మరింత పెంచుకునేందుకు తీసుకోతగిన చర్యలపై చర్చించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే తెలిపారు.

వచ్చే నెల అమెరికాలో మోదీ పర్యటనకు ముందే ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సమావేశమై వాణిజ్యపరమైన అంశాలపై చర్చించాలని నేతలిద్దరూ నిర్ణయించినట్లు వివరించారు. అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న ప్రధాన దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ఈ సందర్భంగా ట్రంప్‌ పేర్కొన్నట్లు గోఖలే చెప్పారు. అలాగే మోదీ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక ఇంధన సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై చర్చించేందుకు ఉన్నతాధికారులను కూడా అవసరమైతే హ్యూస్టన్‌కు పంపేందుకు సిద్ధమని చెప్పారు.  ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీకి హాజరయ్యేందుకు సెప్టెంబర్‌లో అమెరికా వెడుతున్న మోదీ.. 22న హ్యూస్టన్‌లో  ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గోనున్నారు. అలాగే, అమెరికాలోని టాప్‌ ఇంధన కంపెనీల సీఈవోలతో కూడా భేటీ కానున్నారు. అక్కడ ఇంధన రంగంలో పెట్టుబడుల అవకాశాల గురించి చర్చించనున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)