Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నాల్కో షేర్ల బై బ్యాక్కు డెరైక్టర్ల బోర్డు ఆమోదం
Published on Thu, 05/26/2016 - 02:09
న్యూఢిల్లీ: అల్యూమినియం తయారు చేసే ప్రభుత్వ రంగ కంపెనీ నాల్కో షేర్ల బైబ్యాక్కు ఆ కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. 64.43 కోట్ల షేర్లకు (చెల్లించిన మూలధనంలో 25 శాతం వాటా) మించకుండా బై బ్యాక్ కోసం నాల్కో కంపెనీ రూ.2,835 కోట్లు వ్యయం చేయనుంది. ఒక్కో షేర్ను రూ.44కు కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. ఇక ఈబై బ్యాక్కు వాటాదారుల ఆమోదాన్ని ప్రత్యేక తీర్మానం ద్వారా పొందుతామని, దీనిని పోస్టల్ బ్యాలెట్ ద్వారా సమీకరిస్తామని వివరించింది.
ఈ కంపెనీలో 80.93 శాతం వాటా ఉన్న ప్రభుత్వం గతంలో 25 శాతం వాటా విక్రయం ద్వారా రూ.3,250 కోట్లు సమీకరించాలని యోచించింది. బై బ్యాక్ ప్రకటన నేపథ్యంలో నాల్కో షేర్ స్వల్పంగా 1.65 శాతం లాభపడి రూ. 43 వద్ద ముగిసింది.
#
Tags