amp pages | Sakshi

ఆ భవనం కూల్చివేతకు ముహూర్తం ఫిక్స్‌

Published on Wed, 03/06/2019 - 15:28

సాక్షి, ముంబై: డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీకి ఊహించని షాక్‌ తగిలింది. పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితుడు నీవర్‌కు చెందిన అలీబాగ్‌ విలాసవంతమైన భవనాన్ని అధికూరులు  పూర్తిగా కూల్చి వేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ డిటోనేటర్లతో ఈ భవనాన్నిపూర్తిగా నేలమట్టం చేయడానికి శుక్రవారం ముహర్తం పెట్టారు. ఇందుకు ప్రత్యేక టెక్నికల్‌ బృందాన్ని కూడా రప్పించారు.
 
రాయగడ్‌ జిల్లాలో సముద్రతీర ప్రాంతంలో 30వేల చదరపుగజాల్లో విస్తరించి ఉన్న ఈ భవనానికి మూడు డ్రిల్లింగ్‌ మెషీన్ల సాయంతో రంధ్రాలు చేసిన డైనమేట్లు పేర్చి కుప్పకూల్చ నున్నామని అధికారులు చెప్పారు.  ఇప్పటికే ఈ భవనం  పిల్లర్స్‌లో  రంధ్రాలు చేసే  కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అయితే ఈ విలువైన షాండ్లియర్‌ను, బుద్ధుని విగ్రహాన్ని భద్రపరిచామని దీన్ని ఈడీ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు.  పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ జిల్లా అధికారులు కూల్చివేతకు ఆదేశించిన ఈ భవనాన్ని పీఎన్‌ బీ కేసులో ఈడీ ఎటాచ్‌​ చేసింది. ఈ బం‍గ్లా విలువ రూ.100 కోట్లు ఉంటుందని  అంచనా. 

ఈ మేరకు రాయగఢ్‌ జిల్లా కలెక్టరు విజయ్‌ సూర్యవంశి అదనపు కలెక్టరు భరత్‌ షితోలేకు బాధ్యతలను అప్పగించారు. పేలుళ్ల ద్వారా భారీ బిల్డింగులను కూల్చిన అనుభవం భరత్‌ సొంతం.  అంతేకాదు  డిమోలిషన్‌ మ్యాన్‌గా పేరు కూడా తెచ్చుకున్నారు. 

కాగా బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద కుంభకోణానికి కారకులు డైమండ్‌ వర్తకుడు నీరవ్‌ మోదీ, ఆయన మేనమాడ, గీతాంజలి గ్రూప్‌ అధినేత మెహుల్‌ చోక్సీ. సుమారు రూ14వేలకోట్ల మేరకు ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచేసి విదేశాలకు చెక్కేశారు.  ఇప్పటికే  వీరిపై సీబీఐ, ఈడీ కేసులను నమోదు చేయడంతోపాటు,  పలు ఆస్తులను ఎటాచ్‌ చేశాయి.  అటు  ప్రభుత్వం నీరవ్‌, చోక్సీల పాస్‌ పోర్టులను రద్దు చేసింది.  వీరిని తిరిగి దేశానికి రప్పించేందుకు  కసరత్తు  చేస్తున్న సంగతి తెలిసిందే.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?