ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
మరింత సరళంగా జీఎస్టీ
Published on Tue, 01/07/2020 - 20:50
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాపారులకు శుభవార్త అందించారు. జీఎస్టీకి సంబంధించి వ్యాపారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్ని పరిష్కరించేలా చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే జీఎస్టీ వ్యవస్థను మరింత సరళీకృతం చేస్తున్నామని తెలిపారు. వివిధ వర్గాలనుంచి వచ్చిన సూచనల ఆధారంగా పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడానికి, నిజమైన పన్ను చెల్లింపుదారుల వేధింపులను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆర్థికమంత్రి మంగళవారం చెప్పారు.
ఒక సాధారణ వ్యాపారి కూడా జీఎస్టీ నిబంధనలు పాటించేలా జీఎస్టీ నిర్మాణాన్ని మరింత హేతుబద్ధీకరించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒక సాధారణ వ్యాపారి కూడా జీఎస్టీ నిబంధనలుపాటించేలా జీఎస్టీ నిర్మాణాన్నిమరింత హేతుబద్ధీకరించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇందుకు రెవెన్యూ కార్యదర్శి అధ్యక్షతన, ఒక కమిటీని ఏర్పాటు చేశామని ఆర్థికమంత్రి వెల్లడించారు అంతేకాదు వ్యవస్థను సరళీకృతం చేయడానికి కృషి చేసేందుకు సలహాలను ఆహ్వానిస్తున్నామన్నారు. న్యూఢిల్లీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) నిర్వహించిన రెండవరోజు కార్యక్రమంలో సీతారామన్ మాట్లాడారు. సీఏఐటి సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ జీఎస్టీ నమోదు చేసుకున్న వ్యాపారుల సంఖ్యను 2 కోట్లకు పెంచాలని శరీరం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మూడు రోజుల నేషనల్ ట్రేడర్స్ కన్వెన్షన్ (సిఐఐటి)కు దేశవ్యాప్తంగా వ్యాపారులు హాజరవుతున్నారు.
Tags