ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ విమాన టికెట్ల రద్దుకు పూర్తి రీఫండ్
Published on Fri, 04/17/2020 - 07:30
న్యూఢిల్లీ: లాక్డౌన్ మొదటి దశ కాలంలో విమాన టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లభిస్తుందని పౌర విమానయాన శాఖ స్పష్టంచేసింది. కోవిడ్–19 వైరస్ కట్టడిలో భాగంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు తొలి విడత లాక్డౌన్ కొనసాగగా, ఈ కాలంలో బుకింగ్స్ చేసుకున్న విమాన ప్రయాణికులకు రద్దు రుసుము ఏమీ లేకుండా పూర్తి మొత్తం నగదు రూపంలో వెనక్కు వస్తుందని తెలిపింది. మే 3 వరకు ప్రయాణాలకు టికెట్ కొన్న వారికి ఇది వర్తిస్తుందని వివరించింది. పేర్కొన్న కాలంలో నగదుకు బదులుగా భవిష్యత్తు ప్రయాణానికి ఉపయోగపడే క్రెడిట్ అందనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ అంశంపై విమానయాన శాఖ గురువారం స్పష్టతనిచ్చింది.
#
Tags