amp pages | Sakshi

భారీగా పెరిగిన నీరవ్‌ మోదీ క్లయింట్స్‌

Published on Tue, 04/10/2018 - 12:46

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కాం వెలుగులోకి రాకముందు వరకు నీరవ్‌ మోదీ డైమండ్‌ జువెల్లర్స్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద సెలబ్రిటీలందరూ ఈయన కస్టమర్లే. 2016లో డిమానిటైజేషన్‌ ప్రకటించిన ఆ సమయంలో నీరవ్‌ జువెల్లర్స్‌కు ఇక అడ్డూ అదుపు లేదు. 2015-16లో మోదీ డైమండ్స్‌ను కేవలం 86 మంది ధనిక వ్యక్తులే కొనుగోలు చేయగా... ఆ తర్వాత ఏడాది డిమానిటైజేషన్‌ ప్రకటించిన సమయంలో(2016లో) 340 మంది ప్రముఖ, ధనిక కస్టమర్లు నీరవ్‌ మోదీ డైమండ్స్‌ను కొనుగోలు చేసినట్టు తెలిసింది. అంటే దాదాపు నాలుగు రెట్లు ఈయన కస్టమర్లు పెరిగినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వీరందరూ పన్ను అధికారుల కనుసన్నల్లోకి వచ్చేశారు. 

పీఎన్‌బీలో రూ.13,600 కోట్ల స్కామ్‌కు పాల్పడిన నీరవ్‌ మోదీపై ఇప్పటికే విచారణను ముమ్మరం చేసిన అధికారులు, ప్రస్తుతం ఆయన కస్టమర్లపై కూడా కన్నేశారు. పాన్‌ కార్డు లేకుండా.. నగదు ఎక్కడి నుంచి వచ్చిందో సరియైన వనరు తెలుపకుండా.. కోట్లలో విలువ చేసే జువెల్లరీ కొనుగోలు చేసిన 650 మందికి పైగా భారతీయుల జాబితాను పన్ను అధికారులు రూపొందించినట్టు ఇండియా టుడే టీవీ పేర్కొంది. ఆదాయపు పన్ను అధికారులు జరిపిన విశ్లేషణలో ఎక్కువ మొత్తంలో జువెల్లరీ కొనుగోళ్లు సంపన్న, ప్రముఖ వ్యక్తులే జరిపినట్టు తెలిసింది. వీరిలో నీరవ్‌ మోదీకి అధికంగ క్లయింట్స్‌ ఉన్నట్టు వెల్లడైంది.

నీరవ్‌ మోదీకి ఉన్న ప్రముఖ, ధనికవంతులైన క్లయింట్స్‌లో లాయర్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తి అభిషేక్‌ సింఘ్వీ ఉన్నారని తెలిసింది. ఆయన బ్లాక్‌మనీతో రూ.6 కోట్ల విలువైన జువెల్లరీ కొనుగోలు చేసినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ తాను కేవలం రూ.1.6 కోట్ల జువెల్లరీని మాత్రమే కొనుగోలు చేశానని, అదీ కూడా చెక్‌పేమెంట్‌ ద్వారా జరిపినట్టు సింఘ్వీ చెప్పారు. ఆయనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో సీనియర్‌ కాంగ్రెస్‌ మంత్రి కోడలు కూడా కోట్ల విలువ చేసే మోదీ జువెల్లరీని కొనుగోలు చేసిందని, ఆమె నీరవ్‌ మోదీకి అతిపెద్ద కస్టమర్‌ అని రిపోర్టులు పేర్కొంటున్నాయి.  ఈ జాబితాలో అహ్మదాబాద్‌కు చెందిన రియాల్టర్‌, టూ-వీలర్‌ దిగ్గజం ప్రమోటర్స్‌ కుటుంబ సభ్యులు, పుణేకు చెందిన రియాల్టీ సంస్థ ప్రమోటర్లు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీరందరికీ ఐటీ నోటీసులు పంపినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆదాయపు పన్ను శాఖ ఏడాదిన్నర క్రితమే విచారణ జరిపినట్టు, నీరవ్‌ మోదీ కేసు అనంతరం ఎందుకు నోటీసులు పంపుతున్నట్టు ఓ కాంగ్రెస్‌ నేత ప్రశ్నిస్తున్నారు. 

Videos

రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్

వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం

సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం

పోలింగ్పై పోస్టుమార్టం..

ఏలూరులో చల్లారని రగడ...

బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు

చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?

ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)