రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెన్సెక్స్ సరికొత్త రికార్డు!
Published on Wed, 07/02/2014 - 13:44
బ్యాంకింగ్, మెటల్, ఆటో మొబైల్, కాపిటల్ గూడ్స్ రంగాల్లో కొనుగోళ్లు ఊపందుకోవడం, బడ్జెట్ పై సానుకూలాంశాలు ఉండవచ్చనే అంచనాలతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో 25789 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయిని అధిగమించింది.
బుధవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,660 పాయింట్ల వద్ద ఆరంభమై, ఓ దశలో 25,816 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. మధ్యాహ్నం ఒకటిన్నర సమయానికి 292 పాయింట్ల లాభంతో 25811 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 87 పాయింట్ల వృద్దితో 7722 వద్ద కొనసాగుతోంది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సెసా స్టెర్ లైట్ అత్యధికంగా 3.63 శాతం, యునైటెడ్ స్పిరిట్స్, జిందాల్ స్టీల్, మారుతి సుజుకీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, గెయిల్, పీఎన్ బీ, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
#
Tags