amp pages | Sakshi

జీఎస్టీలో మార్పులు?

Published on Fri, 10/06/2017 - 02:07

సాక్షి, న్యూఢిల్లీ:  
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబుల్లో మార్పుచేర్పులు చోటు చేసుకోనున్నాయా..? 60 వస్తువులపై పన్నులు తగ్గించబోతున్నారా? చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు వస్త్ర పరిశ్రమకు కూడా ఊరట కల్పించే దిశగా కేంద్రం యోచిస్తోందా..? తాజా పరిణామాలు గమనిస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. వివిధ వర్గాలకు దీపావళి కానుకగా శుక్రవారం ఢిల్లీలో జరగబోయే 22వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. గురువారం ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో అత్యవసరంగా సమావేశమై మూడు గంటలపాటు ఈ అంశాలపై చర్చించినట్లు సమాచారం. జీఎస్టీ అమలుతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించాల్సిందిగా అధికారులను కోరాననీ, వాటిని త్వరలోనే సరిదిద్దుతామని ప్రధాని ఇప్పటికే చెప్పారు.

సామాన్యులపై ఎక్కువ భారం పడకుండా జీఎస్టీ శ్లాబులను సవరించే దిశగా మోదీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పెద్దనోట్ల రద్దుతో కుంగిపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై జీఎస్టీ భారాన్ని తగ్గించాలని అటు ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కూడా కోరుతున్నారు. అలాగే గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శని, ఆదివారాల్లో మోదీ గుజరాత్‌లో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగబోయే జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎస్టీలో ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్ను శ్లాబులు ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు, పారిశ్రామివేత్తల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు అనుగుణంగా వీటిలో మార్పుచేర్పులు చేయనున్నట్టు సమాచారం. దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, కనీస వేతనాలు, గుజరాత్‌ పర్యటన తదితర అంశాలపై కూడా ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో చర్చించినట్టు తెలిసింది.

పన్ను తగ్గింపు ఏ వస్తువులపై?
ప్రస్తుతం 28 శాతం పన్ను శ్లాబుల్లో ఉన్న దాదాపు 60 వస్తువులపై పన్ను తగ్గించే అవకాశం ఉన్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే 18 శాతం పన్ను శ్లాబులో ఉన్న వస్తువులు, సేవలను 12 శాతం శ్లాబులోకి మార్చే అవకాశాలున్నట్టు వివరించారు. పన్నులు తగ్గిస్తే దీపావళి పండుగ ముంగిట వినియోగదారులకు ఊరట కల్గించినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కేరళ నుంచి హుటాహుటిన షా
మోదీతో సమావేశానికి అమిత్‌ షా కేరళ నుంచి హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వస్థలం మీదుగా బీజేపీ గురువారం జనరక్ష యాత్రను నిర్వహించింది. ఈ యాత్రలో షా పాల్గొనాల్సి ఉంది. కానీ మోదీతో భేటీ పర్యటనను రద్దు చేసుకొని ఢిల్లీ చేరుకున్నారు.  

Videos

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?