అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
స్పైస్జెట్ డి స్కౌంట్ ఆఫర్..
Published on Fri, 08/21/2015 - 01:14
న్యూఢిల్లీ : పలు డిస్కౌంట్ ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తున్న స్పైస్జెట్ తాజాగా ఒకవైపు ప్రయాణ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద లక్షకు పైగా విమాన టికెట్లను రూ.799-రూ.2,699 (పన్ను మినహా) మధ్య ధరలకే ప్రయాణికులకు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ ఈ నెల 20 నుంచి 22 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్లో టికెట్లను బుకింగ్ చేసుకున్న వారు ఈ నెల 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 26 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.
ఈ ఆఫర్ కింద హైదరాబాద్-ఢిల్లీ టికెట్ ధర రూ.1,899గా, హైదరాబాద్ నుంచి రాజమండ్రి, తిరుపతి, విజయవాడల టికెట్ ధర రూ.799గా ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, గోవా, చెన్నై, బెంగళూరు, ముంబై, కోయంబత్తూరు టికెట్ ధర రూ.1,299గా ఉంది. హైదరాబాద్ నుంచి కొచ్చి, అహ్మదాబాద్, మధురై టికెట్ ధర రూ. 1,599గా ఉంది.
Tags