amp pages | Sakshi

మీ వ్యాపార ప్రణాళికలు చెప్పండి

Published on Wed, 01/27/2016 - 00:35

బ్యాంకులను కోరిన ఆర్థికమంత్రిత్వశాఖ
మరింత మూలధనం సమకూర్చడంపై కసరత్తు

 ముంబై: బ్యాంకులకు రానున్న మూడేళ్లలో తగిన మూలధన కల్పనపై ఆర్థికమంత్రిత్వశాఖ దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా మదింపుజరపడానికి చర్యలు ప్రారంభించింది. వచ్చే నాలుగేళ్లలో తమ వాణిజ్య ప్రణాళికల గురించి తెలియజేయాలని  మొండిబకాయిల భారంతో ఉన్న బ్యాంకులను ఆర్థికమంత్రిత్వశాఖ ఆదేశించింది. బ్యాంకుల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ‘ఇంద్రధనస్సు’ కార్యక్రమంలో భాగంగా ఆర్థికమంత్రిత్వశాఖ ఈ చర్యలు చేపట్టింది.

 మొండి బకాయిల సమస్య దిశగా చర్యలు చేపట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒకవైపు బ్యాంకింగ్‌కు నిర్దేశాలు జారీచేయగా... మరోవైపు ప్రభుత్వం తాజా వ్యాపార ప్రణాళికల గురించి మదింపు ప్రారంభించడం గమనార్హం. ఇందుకు సంబంధించి అత్యున్నత స్థాయి వర్గాలు అందించిన సమాచారాన్ని పరిశీలిస్తే...

 పలు బ్యాంకులు ఇప్పటికే తమ వ్యాపార, రుణ, వాణిజ్య ప్రణాళికను నార్త్ బ్లాక్‌కు అందించాయి. మిగిలిన వాటికి కూడా ఈ మేరకు ఆర్థికశాఖ ఆదేశాలు ఇచ్చింది.

వచ్చే నాలుగేళ్లలో రూ.70,000 కోట్లు బ్యాంకింగ్‌కు తాజా మూలధనంగా అందించాలన్నది కేంద్రం ప్రణాళిక. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఇందుకు రూ.25,000 కోట్ల చొప్పున  ఇవ్వాలన్నది ప్రతిపాదన. మిగిలిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10,000 కోట్ల చొప్పున ఇవ్వాలన్నది వ్యూహం. అయితే అవసరమైతే రూ. 70,000 మొత్తాన్ని మరింత పెంచాలని కేంద్రం వ్యూహ రచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాంటి నిర్ణయం తీసుకుంటే వచ్చే నెలాఖరులో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సందర్భంగా ఈ విషయాన్ని వెలువరించే వీలుంది.

 వచ్చే నాలుగేళ్లలో బ్యాంకింగ్‌కు మూలధనంగా మొత్తం లక్షా ఎనభై కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నది అంచనా.  ప్రభుత్వం సమకూర్చగా మిగిలిన మొత్తాలను మార్కెట్ నుంచి బ్యాంకులు సమకూర్చాలన్నది తొలుత వ్యూహం. అయితే మార్కెట్ల తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో మరికొంత మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చాలని భావిస్తున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. మూలధనానికి సంబంధించి అంతర్జాతీయ బాసెల్ 3 ప్రమాణాలను బ్యాంకింగ్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ అమలు పరచాల్సి ఉండడం కూడా ఇక్కడ గమనార్హం.

Videos

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)