amp pages | Sakshi

ఇక అర్ధరాత్రి దాకా ట్రేడింగ్‌!!

Published on Sat, 05/05/2018 - 00:30

న్యూఢిల్లీ: ఈక్విటీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ వేళలను దాదాపు అర్ధరాత్రి దాకా పెంచుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ‘ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్‌ వేళలను ఉదయం 9 నుంచి రాత్రి 11.55 దాకా పెంచుకునేందుకు స్టాక్‌ ఎక్స్చేంజిలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నాం‘ అంటూ సెబీ శుక్రవారం ఒక సర్క్యులర్‌లో పేర్కొంది.

ప్రస్తుతం కమోడిటీ డెరివేటివ్స్‌ విభాగం ట్రేడింగ్‌ వేళలు ఉదయం 10 నుంచి రాత్రి 11.55 దాకా ఉంటుండగా, ఈక్విటీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ వేళలు ఉదయం 9.15 గం.ల నుంచి మధ్యాహ్నం 3.30 గం.ల దాకా మాత్రమే ఉంటున్నాయి. సెబీ నిర్ణయంతో ఈక్విటీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ వేళలను మరో ఎనిమిది గంటల మేర పొడిగించుకునేందుకు స్టాక్‌ ఎక్సే్చంజీలకు వెసులుబాటు లభించినట్లవుతుంది.

ఇటు స్టాక్స్, అటు కమోడిటీల ట్రేడింగ్‌ వేళలను అనుసంధానం చేసే ప్రయత్నాల్లో భాగంగా సెబీ తాజా నిర్ణయం తీసుకుంది. ఒకే ఎక్సే్చంజీలో ఈ రెండింటి ట్రేడింగ్‌ను ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి ప్రవేశపెట్టేలా సెబీ బోర్డు గత డిసెంబర్‌లో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కమోడిటీ డెరివేటివ్స్‌ ప్రస్తుతం ఎంసీఎక్స్, ఎన్‌సీడీఈఎక్స్‌లో మాత్రమే ట్రేడవుతున్నాయి.

షరతులు వర్తిస్తాయ్‌..
ట్రేడింగ్‌ వేళల పొడిగింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నియంత్రణ సంస్థ సెబీ... దీనికి కొన్ని షరతులను కూడా విధించింది. స్టాక్‌ ఎక్సే్చంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు సముచిత రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్, మౌలిక సదుపాయాలను(ఇన్‌ఫ్రా)ను ఏర్పాటు చేసుకుంటేనే ట్రేడింగ్‌ వేళలు పెంచుకునేందుకు అనుమతి లభిస్తుందని స్పష్టం చేసింది.

నిర్ణీత వేళలకు మించి టైమింగ్‌ను పెంచుకోదలచుకుంటే ముందుగా సెబీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. రిస్కు మేనేజ్‌మెంటు వ్యవస్థ, సెటిల్మెంట్‌ ప్రక్రియ, మానవవనరుల(సిబ్బంది) లభ్యత, సిస్టమ్‌ సామర్ధ్యం, పర్యవేక్షణ యంత్రాంగం మొదలైన వివరాలన్నింటితో కూడిన ప్రతిపాదనను స్టాక్‌ ఎక్సే్చంజీలు సమర్పించాల్సి ఉంటుంది.


స్వాగతించిన ఎక్స్చేంజిలు..
చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ట్రేడింగ్‌ వేళల పెంపు ప్రతిపాదనకు ఆమోదముద్ర లభించడాన్ని స్టాక్‌ ఎక్సే్చంజీలు స్వాగతించాయి. దేశీ మార్కెట్లను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేసేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నాయి. భారతీయ క్యాపిటల్‌ మార్కెట్స్‌ మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడగలదని ఇండియన్‌ కమోడిటీ ఎక్స్చేంజి (ఐసీఈఎక్స్‌) ఎండీ సంజిత్‌ ప్రసాద్‌ తెలిపారు.

ట్రేడింగ్‌ వేళల్లో వ్యత్యాసాల వల్ల దేశీ మార్కెట్లపై అంతర్జాతీయ పరిణామాలు .. ప్రతికూల ప్రభావాలు చూపే రిస్కులు కూడా తగ్గుతాయన్నారు. అయితే, పొడిగించే వేళలను కేవలం ఇండెక్స్‌ డెరివేటివ్స్‌కే పరిమితం చేయాలని, స్టాక్స్‌కు కూడా వర్తింపచేస్తే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్సే్చంజెస్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ రాజేశ్‌ బాహేతి అభిప్రాయపడ్డారు.

ఇన్వెస్టర్స్‌కు ప్రయోజనకరం..
ట్రేడింగ్‌ వేళలు పెంచడం దేశీ ఇన్వెస్టర్లకు ప్రయోజనకరం. ప్రతికూలంగానైనా, సానుకూలంగానైనా ప్రభావితం చేసే పరిణామాలు ఉంటే ప్రస్తుతం మన ఇన్వెస్టర్లు తక్షణం స్పందించే పరిస్థితి లేదు. ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే.. సెబీ  నిర్ణయం వల్ల పొజిషన్స్‌ను మరింత మెరుగ్గా హెడ్జింగ్‌ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం విదేశీ ఇన్వెస్టర్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటోంది. అక్టోబర్‌ 1 నుంచి ట్రేడింగ్‌ పరిమాణం మరింత పెరగవచ్చు. – విక్రమ్‌ లిమాయే, ఎన్‌ఎస్‌ఈ ఎండీ

సానుకూల పరిణామం..
ట్రేడింగ్‌ వేళలు పెంచడమనేది సానుకూల పరిణామం. అంతర్జాతీయ మార్కెట్లు, దేశీ కమోడిటీ డెరివేటివ్‌ మార్కెట్స్‌కి అనుగుణంగా దేశీ మార్కెట్లు ట్రేడయ్యేందుకు ఇది దోహదపడుతుంది. అంతర్జాతీయంగా డెరివేటివ్‌ ఎక్సేంజీలు ఇప్పటికే ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. – ఆశీష్‌ కుమార్‌ చౌహాన్, బీఎస్‌ఈ చీఫ్‌

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)