amp pages | Sakshi

కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published on Sat, 12/30/2017 - 14:58

మైలవరం: కృష్ణాజిల్లా మైలవరం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందడంతో పాటు ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మైలవరం నుంచి ఆటోలో 11 మంది వ్యక్తులు పుల్లూరు చర్చిలో ప్రార్థనలో పాల్గొనేందుకు వెళుతుండగా భద్రాచలం నుంచి మైలవరం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా ఆటో డ్రైవర్‌ను విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.

మైలవరం నుంచి సొంత ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మండలంలోని పుల్లూరు గ్రామంలో ప్రార్థనలో పాల్గొనేందుకు 30వ నంబర్‌ జాతీయ రహదారిపై వెళుతుండగా వేగంగా వస్తున్న కారు స్థానిక దర్గా సమీపంలో ఆటోను ఢీకొట్టింది. ఆటో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి రోడ్డు మధ్యకు రావడంతో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టిందని ప్రమాద స్థలంలో ఉన్న వారు తెలిపారు.

మృతి చెందిన వారు మైలవరానికి చెందిన సగ్గుర్తి లత (40), గరికపాటి నాగమణి (25), మందా రాజేశ్వరి (17), గరికపాటి నాగేశ్వరరావు (34) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో మందా రూతమ్మ, పల్లెపోగు కన్యాకుమారి, పల్లెపోగు జన్ని, గరికపాటి యశస్విని, సగ్గుర్తి సుశీల, కటారపు రాణి, పల్లెపోగు జెస్సి ఉన్నారు. స్వల్పంగా గాయపడిన వారిలో కారులో ప్రయాణిస్తున్న షేక్‌ రసూల్, లావూడియా మనోహర్, ముత్యాల సతీష్, డి. రాహుల్, బుద్దా ప్రవీణ్‌ ఉన్నారు. కాగా పాల్వంచ నుంచి ఐదుగురు వ్యక్తులు గన్నవరం విమానాశ్రయానికి వారి బంధువును తీసుకువచ్చేందుకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)