పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏడుగురు విద్యార్థుల దుర్మరణం
Published on Sun, 02/18/2018 - 02:19
సాక్షి, ముంబై: కారు అదుపు తప్పడంతో అందులో షికారుకు బయలుదేరిన 8 మంది విద్యార్థుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. నాగ్పూర్లోని హిస్లాప్ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం ఎర్టిగా కారులో షికారుకు బయలుదేరారు.
నాగ్పూర్–అమరావతి రోడ్డుపై హైల్యాండ్ పార్క్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న వీరి కారు అదుపు తప్పడంతో డివైడర్ను బలంగా ఢీకొని పక్కనే నిలిపి ఉంచిన ట్రక్కుకిందకు దూరిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు యువతులు సహా ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. కారులో మద్యం, సిగరెట్లు లభించినప్పటికీ.. విద్యార్థులు మద్యం సేవించారన్న దానిపై ఎలాంటి స్పష్టతా లేదన్నారు.
#
Tags