amp pages | Sakshi

లాక్‌డౌన్‌: మహిళను కాల్చి చంపిన జవాను!

Published on Thu, 04/02/2020 - 15:09

లక్నో: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి గ్రామానికి వచ్చిన వలస జీవుల జాబితాలో తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లు ఉండటంతో ఓ ఆర్మీ జవాను సహనం కోల్పోయాడు. ఈ క్రమంలో తలెత్తిన వివాదంలో ఓ మహిళను కాల్చి చంపేశాడు. వివరాలు... కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కరోనా మహమ్మారి భయంతో వలస జీవులు స్వస్థలాలకు పయనమవుతున్నారు. అయితే వీరి కారణంగా తమకు కూడా అంటువ్యాధి సోకుతుందని భావిస్తున్న గ్రామస్తులు.. ఊర్లోకి కొత్తగా వచ్చిన వారి సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నారు. సదరు వ్యక్తులను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తున్నారు.(అక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తారంటే!)

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో గల అలీపూర్‌ గ్రామ పెద్దలు ఈ వివరాలు సేకరించాల్సిందిగా వినయ్‌ యాదవ్‌ అనే వ్యక్తిని పురమాయించారు. ఈ క్రమంలో ఇటీవల కలకత్తా నుంచి తిరిగి వచ్చిన వారి జాబితాను అతడు అధికారులకు అందజేశాడు. అయితే అందులో తమ పేర్లను ఎందుకు చేర్చావంటూ జవాను శైలేంద్ర వినయ్‌తో గొడవకు దిగాడు. దీంతో ఓ మహిళ సహా మరో వ్యక్తి వినయ్‌కు అండగా నిలబడ్డారు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన శైలేంద్ర సదరు మహిళను తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. కాగా శైలేంద్ర చర్యను తీవ్రంగా పరిగణించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)